చినుకు రాలింది.. దోమ పుట్టింది
చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు.. గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది.. పుర సిబ్బంది మేల్కొనకపోతే జనం రోగాలబారిన పడటం ఖాయం.
మేల్కొనకపోతే ప్రమాదమే
కట్టడికి కదలని పుర సిబ్బంది
చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు.. గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది.. పుర సిబ్బంది మేల్కొనకపోతే జనం రోగాలబారిన పడటం ఖాయం. వర్షాకాలం రాకమునుపే కేసులు వెలుగు చూస్తున్నాయి. నగరం, పట్టణాల్లో అపరిశుభ్రత వెంటాడుతోంది. ఏటా పన్నుల రూపేణా ఆదాయం పొందుతున్న పురపాలికలు ఆ స్థాయిలో ప్రజారోగ్యంపై దృష్టి సారించడం లేదు. వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా.. తొలగించే పరిస్థితి లేదు. జనం జ్వరాల బారిన పడుతున్నారు. ప్రాణాలమీదికొస్తున్నా.. పట్టించుకునేవారు కరవయ్యారు. పుర యంత్రాంగం మేల్కొనకపోతే జనాలకు రోగాల ముప్పు తప్పేలా లేదనేది స్పష్టమవుతోంది.
న్యూస్టుడే, ఆదోని, నంద్యాల పురపాలకం, కర్నూలు నగరపాలక సంస్థ, పాతపట్టణం
పట్టించుకోని ప్రజారోగ్య వ్యవస్థ
పురపాలికల్లో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కర్నూలు నగరపాలక సంస్థలో ఏటా రూ.50 లక్షలు, నంద్యాలలో రూ.10-15 లక్షలు, ఆదోనిలో రూ.5-10 లక్షల వరకు దోమల నివారణకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, గూడూరు తదితర పురపాలికల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక్కడా ఒక్కో పురపాలికల్లో ఏటా రూ.1-2 లక్షలు ఖర్చు చేస్తున్నా.. కేసుల తీవ్రత ఆగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతం. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ఫలితాలు కనిపించడం లేదు. తొమ్మిది పురపాలికల్లో ఫాగింగ్ యంత్రాలు 20-25, పిచికారీ పరికరాలు 350 వరకు ఉన్నాయి. వీటికి పని చెప్పక.... చాలా వాటిని మూలన పడేశారు.
తొంగి చూసిన డెంగీ
ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 2024 ఏడాది జనవరి నుంచి మే నెలవరకు మొత్తం 192 డెంగీ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 168, నంద్యాల జిల్లాలో 24 కేసులు వచ్చాయి. మలేరియా కేసులు కర్నూలు జిల్లాలో రెండు వెలుగు చూశాయి. మండు వేసవిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక వర్షాకాలంలో పరిస్థితి తలచుకుంటే ఆందోళన కలిగిస్తోంది.
కానరాని ప్రత్యేక కార్యక్రమాలు
2014-19 మధ్య కాలంలో ‘దోమలపై దండయాత్ర’ పేరుతో నివారణ చర్యలు చేపట్టేవి. ఇవి ప్రజలను ఎంతో ఆలోచింపజేసేవి. ప్రతి శుక్రవారం ఫ్రై డే.. డ్రై డే నిర్వహించేవారు. దోమలు పుట్టే ప్రాంతాలను గుర్తించి.. నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. ఇక వార్డుల్లో నీటి తొట్టెలు, పాత సామగ్రి, అపరిశుభ్రత, ట్యాంకులను తెరిచి ఉంచడం, టెంకాయ చిప్పలు, టైర్లలో నీరు నిలిచి ఉండటం తదితరాలతో వచ్చే అనర్థాలను జనాలకు వివరించే వారు. వారిలో చైతన్యపర్చే కార్యక్రమాలు చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వంలో ఇలాంటివి కనిపించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది..? కేసులు వచ్చిన చోట ఏం చేయాలి? భవిష్యత్తు కార్యచరణ ఏమిటి...? అనే ఆలోచన లేకపోయింది.
నిధులు పక్కదారి
దోమల నివారణ పేరుతో నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కంటికి కనిపించే లెక్కలు కావు.. చేసిన పనులకు లెక్కలు వేయలేని పరిస్థితి. దీంతో ఈ విభాగంలో నిధులు పక్కదారి పట్టించారు. కర్నూలు నగరపాలక సంస్థలో ఇంధనం వాడకం పేరుతో సుమారు రూ.లక్షలు జేబులో వేసుకున్నారు. గతంలో ఆదోని పురపాలక సంఘంలో నాసిరకం బ్లీచింగ్, మలాథియన్ ద్రావణం తెప్పించి.. అధిక మొత్తంలో బిల్లులు చేసి, సొమ్ము స్వాహా చేశారు. అన్ని పురాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫాగింగ్ పేరుతో తిప్పే వాహనాలకు ఇంధనం కోసం బోగస్ బిల్లులు తయారుచేసి అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే