వేరుశనగ విత్తు.. నాసిరకం ఎత్తు
గతేడాది రెండు సీజన్లు ‘కరవు’లో కలిశాయి. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో హలధారి ఆనందంగా పొలంబాట పడుతున్నారు.. పొలాలను హలాలు దున్నుతున్నాయి.
జిల్లాకు చేరిన విత్తనకాయలు
గతేడాది రెండు సీజన్లు ‘కరవు’లో కలిశాయి. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో హలధారి ఆనందంగా పొలంబాట పడుతున్నారు.. పొలాలను హలాలు దున్నుతున్నాయి.. రైతులు విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 16,379 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయ కేటాయించారు. విత్తన పంపిణీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యాపారులకు లాభం చేసేదిలా ఉంది. ఆ విత్తనాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.
న్యూస్టుడే, కర్నూలు వ్యవసాయం
సాగుకు సరిపోని కేటాయింపులు
ఉమ్మడి కర్నూలు జిల్లాకు కె-6, టీసీజీఎస్-1694, కదిరి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలు కేటాయించారు. కర్నూలు జిల్లా పరిధిలోని పత్తికొండ, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్ పరిధిలో 58,969 హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది.. 13,929 క్వింటాళ్ల విత్తనం కేటాయించారు. మరో ఐదు వేల క్వింటాళ్లు కేటాయించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించినా వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. నంద్యాల జిల్లా డోన్ సబ్ డివిజన్ పరిధిలోని డోన్, ప్యాపిలి మండలాల్లో వేరుశనగ సాగవుతోంది. 2,450 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు.
వ్యాపారులకు లాభం
గతంలో ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో కొనసాగిన విత్తనోత్పత్తి పథకం ద్వారా సేకరించేవారు. రైతులకు మూల విత్తనం అందించి సాగు చేపట్టేవారు. పంట పూర్తికాగానే కొనుగోలు చేసేవారు.. వాటిని ప్రాసెసింగ్ చేసి విత్తనాలు అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి నేరుగా వ్యాపారుల నుంచి సేకరించారు. సదరు వ్యాపారులు రైతులకు క్వింటాకు రూ.6,500-రూ.7,000 చెల్లించి కొనుగోలు చేశారు. వాటిని ఏపీ సీడ్స్ సంస్థ క్వింటాకు రూ.9,500 చెల్లించి తీసుకొంది. క్వింటాపై రూ.2,500 వ్యాపారులకు లాభం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు.
రైతులకు రూ.కోటి భారం
ప్రభుత్వం 40 శాతం రాయితీతో వేరుశనగ విత్తన కాయలు అందజేస్తోంది. కిలో ధర రూ.95గా నిర్ణయించారు.. ఇందులో 40 శాతం రాయితీ పోతే రైతులు రూ.57 చెల్లిస్తే కిలో విత్తన కాయలు ఇస్తారు. ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేస్తే 40 శాతం రాయితీ పోనూ రూ.4,500-రూ.5,000 కు క్వింటా వేరుశనగ విత్తనం అందించడానికి వీలుంది. ప్రభుత్వం అందజేస్తున్న విత్తన కాయలు కొనుగోలు చేసే రైతులకు క్వింటాపై రూ.500 భారం పడుతోంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా రైతులకు రూ.కోటి వరకు విత్తన భారం పడుతుందని అంచనా.
ప్రాసెసింగ్ను పరిశీలించని అధికారులు
ఏపీ సీడ్స్ సంస్థ విత్తనాలను జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జల్లాపురంలోని మహంకాలేశ్వర అగ్రిటెక్ ప్రైవేటు లిమిటెడ్, కర్నూలు జిల్లా ఉల్చాల రోడ్డులో మునగాలపాడు పరిధిలో చక్ర సీడ్స్, కల్లూరు మండల పరిధిలోని కల్లూరు పారిశ్రామికవాడలో శ్రీకృష్ణ సీడ్స్, శ్రీ శివసాయి సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లలో శుద్ధి ప్రక్రియ చేపడుతోంది. పరిశీలించేందుకు ఏఈవోలను ఇన్ఛార్జులుగా నియమించారు. ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అధికారులు అటువైపు వెళ్లలేదు. దీంతో 30 కిలోల సంచిలో 60 శాతం నాణ్యమైనవి.. 40 శాతం నాసిరకమైనవి కలిపేసి మాయ చేసినట్లు తెలుస్తోంది.
విత్తన శుద్ధి.. అబద్ధం
- వ్యాపారులు మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు వేరుశనగ విత్తనకాయలు కొనుగోలు చేసి ఏపీ సీడ్స్ సంస్థకు సరఫరా చేస్తున్నారు. వాటిని శుద్ధి చేసిన ప్రయోగశాలల్లో నాణ్యతను నిర్ధారించిన తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా మమ అనిపించి 30 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేసి పదివేల క్వింటాళ్ల వరకు పంపించారు. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విత్తన శుద్ధి ప్రక్రియ గాడి తప్పింది.
- కె-6 రకం గతంలో నాణ్యతగా ఉండేది. ప్రస్తుతం అంతా మిశ్రమంగా ఉంది.. విత్తనం నాసిరకంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఈ రకం విత్తన గింజలకు ముక్కులా మొన ఉంటుంది. ప్రస్తుతం విత్తన గింజల్లో అలాంటివి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
- కదిరి లేపాక్షి విత్తనకాయలూ నాసిరకంగానే ఉన్నాయి. దిగుబడి బాగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. గింజ చేదుగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. దీని వల్ల ఆశించిన ధర రావడం లేదు.
- టీసీజీఎస్-1694 రకం విత్తనానికి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ఇతర రకాలు కలిపి ప్యాకింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి
[ 27-07-2024]
ఎస్పీ జి.బిందు మాధవ్ ఆర్టీసి, ట్రాన్స్కో, నేషనల్ హైవే అథారిటీ, మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి