logo

కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుస్తారు

తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థులు జిల్లాలో అన్ని స్థానాల్లో గెలవనున్నట్లు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 25 May 2024 02:55 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థులు జిల్లాలో అన్ని స్థానాల్లో గెలవనున్నట్లు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తిని కర్నూలులోని ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగడంతో వైకాపా కంటే తెదేపాకే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టో, సూపర్‌ 6 పథకాలు, బీసీ చట్టాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. అయిదేళ్ల జగన్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం ప్రచారానికే పరిమితమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, పార్టీ నాయకులు నాగేంద్ర, బషీర్, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని