అక్రమాలకు అడ్డుకట్టలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు ద్వారా మద్యం విక్రయించే విధానం నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్ చొరవతో సదరు విధానానికి తెర పడింది.
ఆన్లైన్ చెల్లింపులతోనే మద్యం అమ్మకాలు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు ద్వారా మద్యం విక్రయించే విధానం నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్ చొరవతో సదరు విధానానికి తెర పడింది. కేవలం ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే శుక్రవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 175 మద్యం దుకాణాలున్నాయి. ప్రతిరోజూ రూ.4 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కేవలం నగదు ద్వారానే అమ్మకాలు జరిగేవి. డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేయాలని జనం, ప్రతిపక్షాలు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం నగదుతో విక్రయాలు చేయడం ద్వారా పెద్ద కుంభకోణం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదుతోపాటు డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా అమ్మకాలు జరిపే విధానం అమలులోకి వచ్చింది.
గొలుసు దుకాణదారులతో కుమ్మక్కై..
ప్రసుత్తం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ చెల్లింపుల ద్వారా అమ్మకాలు జరపాలని మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించి శుక్రవారం నుంచి అమలు చేశారు. కాగా కర్నూలులో పలువురు మందుబాబులు దుకాణాల్లో పనిచేసే సేల్స్మెన్, సూపర్వైజర్లతో గొడవకు దిగారు. ఆన్లైన్ అమ్మకాల కారణంగా గొలుసు దుకాణాల నిర్వాహకులు, సేల్స్మెన్లకు మధ్య సంబంధాలకు చెక్ పడింది. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తికి మూడు మద్యం సీసాలు మాత్రమే విక్రయించాల్సి ఉంది. అయితే సేల్స్మెన్లు గతంలో గొలుసు దుకాణ నిర్వాహకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరిపేవారు. నగదు విధానం కావటంతో అక్రమ అమ్మకాల వ్యవహారం బయటపడేది కాదు. ప్రస్తుతం ఆన్లైన్ నగదు చెల్లింపుల విధానంతో గొలుసు దుకాణాల నిర్వాహకులకు కళ్లెం పడింది. సేల్స్మెన్లు అధిక ధరలకు విక్రయించే అవకాశం లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే