logo

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. అర్ధరాత్రి రహదారి ప్రమాదం

డోన్‌ జాతీయరహదారిలో ఉంగరానిగుండ్ల బస్‌స్టాప్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.

Published : 25 May 2024 02:58 IST

ముగ్గురు యువకుల దుర్మరణం

డోన్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: డోన్‌ జాతీయరహదారిలో ఉంగరానిగుండ్ల బస్‌స్టాప్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. డోన్‌ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన దశరథ, తుగ్గలి మండలం లింగనేనిదొడ్డికి చెందిన ముని, ప్రభాకర్‌ ద్విచక్రవాహనంపై పెయింట్‌ పని నిమిత్తం డోన్‌కు వచ్చారు. పని ముగించుకొని వర్షంలో తిరిగి గ్రామానికి వెళ్తుండగా...డోన్‌ జాతీయరహదారిలోని ఉంగరానిగుండ్ల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వారిని హైవే పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా...ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని