రుణం ఇప్పిస్తామని మోసం
రోజు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్న ఎరుకల వెంకటరాముడుకు ఓ మహిళ ఫోన్ చేసి.. మీకు మా సంస్థ నుంచి రూ.5 లక్షలు రుణం మంజూరైంది.. నీకు రుణం కావాలంటే కొంత నగదు చెల్లించాలని చెప్పారు.
ఆదోని వాసికి సైబర్ నేరగాళ్ల వల
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: రోజు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్న ఎరుకల వెంకటరాముడుకు ఓ మహిళ ఫోన్ చేసి.. మీకు మా సంస్థ నుంచి రూ.5 లక్షలు రుణం మంజూరైంది.. నీకు రుణం కావాలంటే కొంత నగదు చెల్లించాలని చెప్పారు. ఇది నిజమనుకున్న వెంకటరాముడు వారు అడిగిన డబ్బులు ఫోన్ పే ద్వారా చెల్లించాడు.. చివరకు తనను మోసగించారని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆదోని పట్టణంలో శుక్రవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం ఇందిరానగర్ ఎరుకల కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకల వెంకటరాముడు రోజు కూలీ పనులకు వెళ్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడు రోజులు కిందట ఓ మహిళా ఫోన్ చేసి.. తమ ఫైనాన్స్ సంస్థ మీ పేరుపై రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారని.. మీకు డబ్బులు కావాలంటే రుణం ఇస్తామని చెప్పారు. ఇది నిజమనుకున్న వెంకటరాముడు వెంటనే నాకు రుణం కావాలని సమాధానం ఇచ్చారు. ఇంతలోనే ముందుగా రుణం మంజూరుకు అవసరమైన ప్రాసెసింగ్ కోసం ముందుగా రూ.3,500 చెల్లించాలని చెప్పడంతో.. ఆయన ఫోన్పే ద్వారా నగదు పంపించారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఫీజుల పేరుతో ఇలా మొత్తం రూ.1.07 లక్షలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత రుణం డబ్బులు ఎంతకూ తన ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వెంకటరాముడు ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో దాచుకున్న రూ.1.07 లక్షల నగదు పోగొట్టుకోవడంతో వెంకటరాముడు కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్