పట్నవాసం.. చీకటి శాపం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. నెలల తరబడి వెలగకున్నా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి.
అధ్వానంగా ఎల్ఈడీ దీపాల నిర్వహణ
శివారు కాలనీల్లో అంధకారం
న్యూస్టుడే, ఆదోని పురపాలకం, కర్నూలు నగరపాలక సంస్థ, నంద్యాల పురపాలకం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. నెలల తరబడి వెలగకున్నా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి జనం చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఎదురెదురుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చివరికి వీధి దీపాల విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఎల్ఈడీ దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది పురపాలక సంఘాల్లో యాభై వేలకుపైగా వీధి దీపాలున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2016-17 మధ్యకాలంలో ఈఈఎస్ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఎల్ఈడీ దీపాల నిర్వహణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పాత బల్బుల స్థానంలో ఎల్ఈడీలను తెరపైకి తెచ్చారు. ఫలితంగా విద్యుత్తు ఆదా పెరిగింది. బిల్లుల రూపేణా ఆర్థిక భారం తగ్గింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీపాల నిర్వహణను అటకెక్కించింది. ఫలితంగా శివారు కాలనీల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయి. నేటికీ ప్రతి పురపాలక సంఘంలో పదుల సంఖ్యలో దీపాలు అవసరమైనా సకాలంలో సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఏటా పన్నుల రూపేణా పురపాలికల నుంచి రూ.180-190 కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.
భారీగా బకాయిలు
ఆదోని పట్టణంలోని 42 వార్డుల్లో 7 వేల వరకు ఎల్ఈడీలున్నాయి. గతంలో పాత దీపాల కారణంగా నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వచ్చేది. ఎల్ఈడీ దీపాల ఏర్పాటుతో ఆ బిల్లు కాస్త రూ.4 లక్షలకు తగ్గింది. వైకాపా ప్రభుత్వం ఎల్ఈడీల నిర్వహణను పట్టించుకోకపోవడంతోపాటు సంబంధిత ఏజెన్సీకి నిర్ణీత మొత్తం చెల్లించకపోవడంతో ప్రజలకు అవస్థలు ప్రారంభమయ్యాయి. బిల్లులు ఇస్తేగానీ వీధి దీపాలు సరఫరా చేయమంటూ ఏజెన్సీ తెగేసి చెప్పింది. ఇప్పటికీ ఈఈఎస్ఎల్ కంపెనీకి సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. దేవీనగర్, పైకొట్టాలు, హనుమాన్నగర్, మహాయోగి లక్ష్మమ్మ నగర్ తదితర కాలనీల్లో ఎల్ఈడీ దీపాల అవసరం ఉంది. ఆలూరు వైపు వెళ్లే మార్గంలో కేవీఆర్, భీమిరెడ్డి నగర్, న్యూగాంధీ నగర్, అమరావతినగర్, విజయనగర కాలనీ, ప్రకాష్నగర్ ప్రాంతాల్లో నేటికీ దీపాలు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలులో కష్టాలే..
కర్నూలు నగర పరిధిలో 52 వార్డులుండగా 24 వేలకుపైగా వీధి దీపాలున్నాయి. ఈఈఎస్ఎల్ కంపెనీ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. శివారు కాలనీలతో పాటు విలీన గ్రామాల్లో వీధి దీపాల సమస్య ఎక్కువగా ఉంది. నంద్యాల చెక్పోస్టు, పెద్దపాడు రహదారి, వీకర్ సెక్షన్ కాలనీ, శరీన్నగర్తోపాటు పలు కాలనీల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. ఫలితంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా పురపాలక సంఘాల్లో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు దృష్టి సారించడం లేదు.
నంద్యాలలో తప్పని అవస్థలు
నంద్యాలలో 42 వార్డులు ఉండగా.. 10 వేలకు పైగా ఎల్ఈడీలు ఉన్నాయి. వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఫలితంగా పలు ప్రాంతాల్లో దీపాలు వెలగడం లేదు. శ్రీనివాసనగర్, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండు, జగజ్జననీనగర్, దేవనగర్, పద్మావతినగర్, టెక్కె, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో దీపాలు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి. శివారు కాలనీలైన రైతునగరం, వెంకటేశ్వరపురం, పొన్నాపురం తదితర కాలనీల్లో చాలాచోట్ల విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకనూ రెండు వేల వరకు వీధి దీపాల అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?