రాయితీలోనూ కోతేశారు
ప్రసుత్తం తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన విత్తనాలు సమకూర్చాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాకు 4,014 క్వింటాళ్ల పచ్చిరొట్ట కేటాయింపు
అందులోనూ భారీగా తగ్గింపు
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం
ప్రసుత్తం తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన విత్తనాలు సమకూర్చాల్సి ఉంది. భూసారం పెంచేలా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట ఎరువులను రాయితీపై అందించాల్సి ఉంది. ఇప్పటివరకు పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధమవ్వలేదు. మరోవైపు కేటాయింపుల్లోనూ కోతలు విధించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు 4.19 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లుగా ఉంది. రైతులకు జీలుగ, పిల్లి పెసర విత్తనాలు 50 శాతం రాయితీపై పంపిణీకి చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు 222 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,792 క్వింటాళ్లు కలిపి ఉమ్మడి జిల్లాకు 4,014 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు పంపింది.
ఉమ్మడి జిల్లాకు...
కర్నూలు జిల్లాలో 31.50 క్వింటాళ్ల జీలుగ, 3.40 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు, నంద్యాల జిల్లాలో పిల్లిపెసర 6.48 క్వింటాళ్లు, జనుము 1.90, జీలుగ 2,565.70 క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,617.36 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర వ్యవసాయశాఖ 4,014 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు కేటాయించగా అందులో 1,396.64 క్వింటాళ్ల మేర జిల్లా వ్యవసాయశాఖ అధికారులు కోత విధించడం గమనార్హం.
జీలుగ విత్తనాలు కిలో ధర రూ.88 ఉండగా రాయితీపోనూ రూ.44, పిల్లి పెసర కిలో ధర రూ.134 ఉండగా రాయితీ పోను రైతులు రూ.67 చెల్లించాల్సి ఉంటుంది.
సన్నద్ధత కరవు
ఉమ్మడి జిల్లాలో మే నెలలో సాధారణం కంటే వంద శాతం అధికంగా వర్షాలు కురిశాయి. వారంరోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుంది. ఈ అదునులో జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు నేటికీ ప్రారంభించలేదు. కర్నూలు జిల్లాలో ఎక్కువగా పత్తి, మిరప, వరి పంటలు సాగవుతాయి. ఖరీఫ్ సీజన్లో ముందుగా రైతులు తమ పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేస్తారు. ఆ పంటను తిరిగి దున్నితే నేల స్వభావం పెరిగి దిగుబడులు బాగుంటాయి. కానీ ఖరీఫ్పై వ్యవసాయశాఖ అధికారుల్లో సన్నద్ధత కొరవడింది. పంపిణీ చేసే విత్తనాలు అరకొరగా కేటాయించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తప్పని అదనపు భారం
ప్రభుత్వం ఏటా వ్యవసాయశాఖ ద్వారా ఖరీఫ్ సీజన్లో జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేస్తుంది. ప్రసుత్తం పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో 26 మండలాలకు పచ్చిరొట్ట విత్తనాలు క్వింటా కూడా కేటాయించలేదు. తమకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయాలని ఆయా మండలాల్లో అన్నదాతలు విన్నవిస్తున్నా వ్యవసాయాధికారులు విత్తనాల ఊసే ఎత్తడం లేదు. బయట మార్కెట్లో పిల్లిపెసర క్వింటా రూ.13,400 ధర ఉంది. రైతులు బయట కొనుగోలు చేసి భూసారం పెంచుకోవాలంటే అదనపు భారం తప్పదు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన మేర విత్తనాలు అందించాల్సి ఉంది.
అన్నదాతల ఆగ్రహం
కర్నూలు జిల్లాలో 26 మండలాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఖరీఫ్ సాధారణ సాగు 4.20 లక్షల హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ఐదు మండలాల్లో 31.5 క్వింటాళ్ల జీలుగ, 3.4 క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని మండల వ్యవసాయాధికారులు ప్రతిపాదనలు పంపగా 18 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 1.36 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు కేటాయించారు. జనుము ఒక్క కిలో కూడా మంజూరుకాకపోవడం గమనార్హం. పచ్చిరొట్ట ఎరువులు అరకొరగా కేటాయింపులు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మమ అనిపించేశారు..
నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా అందులో 24 ప్రాంతాలకు 3,683.62 క్వింటాళ్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2,565.70 క్వింటాళ్ల జీలుగ, నాలుగు మండలాలకు 15.50 క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని పేర్కొనగా కేవలం 6.48 క్వింటాళ్లు, సంజామల మండలానికి 4.00 క్వింటాళ్ల జనుము అవసరమని ప్రతిపాదనలు పంపగా 1.90 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. నంద్యాలకు నాలుగు క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని ప్రతిపాదనలు పంపితే ఒక రైతుకు 40 కిలోలు, మహానందిలో 2.50 క్వింటాళ్ల పిల్లిపెసర అవసరమని ప్రతిపాదనలు పంపితే ఒకే ఒక్క రైతుకు 40 కేజీలు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్