అంగన్వాడీ.. చదువులు చతికిలబడి
అంగన్వాడీ కేంద్రాల్లో ఏటా చిన్నారుల చేరిక తగ్గుతోంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు 3-6 ఏళ్ల వయసున్న చిన్నారులకు విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు.
కేంద్రాలకు ఏటా తగ్గుతున్న ఆదరణ
రైతునగరం (నంద్యాల), నందికొట్కూరు, న్యూస్టుడే : అంగన్వాడీ కేంద్రాల్లో ఏటా చిన్నారుల చేరిక తగ్గుతోంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు 3-6 ఏళ్ల వయసున్న చిన్నారులకు విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా వీటిలో చిన్నారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చివరికి ఇవి పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయి.
ఆసక్తి చూపని తల్లిదండ్రులు
అంగన్వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దామని.. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోంది. వాస్తవంగా పరిశీలిస్తే తల్లిదండ్రులు పౌష్టికాహారం తీసుకుంటున్నారే తప్ప తమ పిల్లలను వీటిలో చేర్పించేందుకు ఆసక్తి చూపడంలేదు. అంగన్వాడీల్లో విద్యాబోధన అంతంతమాత్రంగా ఉంటోందని వారు పేర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా కార్యకర్తలకు గతంలో శిక్షణ తరగతులు నిర్వహించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక టేక్ హోం రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి సరకుల పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం వంటి అదనపు పనులు అప్పగించింది. కార్యకర్తలు ఈ పనులన్నీ చేస్తూనే 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు విద్యాబోధన చేయాల్సి వస్తోందని.. ఫలితంగా బోధనపై అంత శ్రద్ధ పెట్టడం లేదని పిల్లల తలిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
వేసవి సెలవుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సదుపాయాలు, విద్యా బోధనపై అధికారులు, కార్యకర్తలు, ఆయాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేవారు. మీ పిల్లల బాధ్యత మాదంటూ తల్లిదండ్రులను ఒప్పించి కేంద్రాల్లో చేర్చుకునేవారు. ఇటీవల కాలంలో ప్రచారం మరిచిపోయారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదీ ఓ కారణమని ప్రజలు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఇలా..
- నంద్యాల జిల్లాలోని 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,663 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,620 ప్రధాన, 43 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2022-23లో 39,462 మంది ఉండేవారు. 2023-24 విద్యా సంవత్సరంలో 37,076 వేల మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.
- నంద్యాల అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 295 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2022-23 విద్యా సంవత్సరంతో 7,746 మంది ఉండేవారు. 2023-24లో 926 మంది తగ్గడం గమనార్హం.
1 నుంచి అంగన్వాడీ బాట
- నిర్మల, ఐసీడీఎస్ పీడీ, నంద్యాల
అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టనున్నాం. పది రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి అంగన్వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న సదుపాయాలు, అందించే పౌష్టికాహారం, నాణ్యమైన విద్య గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీల్లో విద్యార్థులకు ఉచితంగానే నాణ్యమైన విద్య అందుతుందన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను చేర్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు