ఆట..అటకెక్కింది
2024 వేసవి క్రీడా శిబిరాలు ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ శిబిరాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 25 క్రీడాంశాల్లో 25 ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉండగా, కర్నూలు నగరానికే పరిమితం చేశారు.
నిధులు మంజూరు చేయని శాప్
ఇళ్లకే పరిమితమైన చిన్నారులు
న్యూస్టుడే, కర్నూలు క్రీడలు (బి.క్యాంపు)
2024 వేసవి క్రీడా శిబిరాలు ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ శిబిరాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 25 క్రీడాంశాల్లో 25 ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉండగా, కర్నూలు నగరానికే పరిమితం చేశారు. ఒక్కో శిబిరానికి రూ.10 వేల చొప్పన కేటాయించారు. ఏటా నగరంతోపాటు గ్రామీణ వేసవి శిబిరాలకు శాప్ నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ మంజూరు చేయలేదు.
ఉమ్మడి కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాలతోపాటు మండల కేంద్రాలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానాలు వేదికగా వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ జరిగేది. 45 క్రీడాంశాల్లో ఉమ్మడి జిల్లాలో 100 ప్రాంతాల్లో వేసవి శిబిరాలు జరిగేవి. ఒక్కో శిబిరానికి రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ రూ.10 వేలు ఇస్తోంది. ఈ నిధులతో ప్రారంభోత్సవ బ్యానర్లు, క్రీడా కిట్లు, ముగింపు సమయంలో క్రీడా పోటీలు నిర్వహించి పతకాలకు వినియోగించేవారు. ఈ డబ్బులు సరిపోకపోతే.. దాతల నుంచి నిధులను సేకరించి శిబిరాలను వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాలు, గ్రామపెద్దలు ముగించేవారు.
గతంలో పండగ వాతావరణమే..
నెల రోజులపాటు సాగే శిబిరంలో చిన్నారులకు తేలికపాటి వ్యామాయం, శారీరక సామర్థ్యం కోసం కసరత్తులు, సంబందిత క్రీడల్లో నైపుణ్యం సాధించే విధంగా శిక్షణ సాగేది. ఈ శిక్షణ సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమక్షంలో నిర్వహించేవారు. ఒక్కో శిబిరానికి 40 నుంచి 50 మంది క్రీడాకారులతో పండగ వాతావరణాన్ని తలపించేది. చిన్నారుల ఉత్సాహం చూసిన గ్రామపెద్దలు, దాతలు ముందుకు వచ్చి శిక్షణ పొందిన చిన్నారులకు పౌష్టికాహారం అందించేవారు. ప్రస్తుతం వేసవి శిబిరాలు లేకపోవడంతో గ్రామీణ చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు.
నిధులు రాకపోవడంతో..
ఎన్నికల నేపథ్యంలో వేసవి శిబిరాల నిర్వహణ ఆలస్యమైంది. 2024 వేసవి శిబిరాలకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిధులు మంజూరు చేయలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి వేసవి శిబిరాల నిర్వహణ అటకెక్కింది. చాలా మంది చిన్నారులు శిబిరాలు లేక ఇళ్ల వద్దనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రైవేటు అకాడమీల్లో...
నంద్యాల, ఆదోని, ఆళ్లగడ్డ నియోజవర్గాలతోపాటు మండల కేంద్రాల్లో పలు ప్రైవేటు క్రీడా అకాడమీలు వెలిశాయి. ఇందులో వ్యాయామ ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈసారి ప్రభుత్వ శిబిరాలు లేకపోవడంతో కొంత మంది చిన్నారులు ప్రైవేటు అకాడమీలకు వెళ్తున్నారు. కొన్ని అకాడమీలు రూ.500 నుంచి రూ.1000 వరకు రుసుము వసూలు చేస్తూ చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు