చెదిరిన పర్యాటక కల
పర్యాటక శాఖ నిర్లక్ష్యం అవుకు జలవిహార కేంద్రానికి శాపంగా పరిణమించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతినివ్వాల్సి ఉండగా అవేమీ కానరావడం లేదు. జలవిహార కేంద్రం ఎందుకూ పనికిరాకుండా పోయింది.
న్యూస్టుడే, అవుకు
పర్యాటక శాఖ నిర్లక్ష్యం అవుకు జలవిహార కేంద్రానికి శాపంగా పరిణమించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతినివ్వాల్సి ఉండగా అవేమీ కానరావడం లేదు. జలవిహార కేంద్రం ఎందుకూ పనికిరాకుండా పోయింది. రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారగా, విలువైన బోట్లు తుప్పుపట్టి పనికి రాకుండా పోయాయి. ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడింది.
అవుకు జలాశయంలో బోటు షికారు, సీమవాసులకు జల విహారం అనుభూతిని కల్పించడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు రాబడి సమకూరుతుందనే లక్ష్యంతో ఏడేళ్ల కిందట అవుకు జలవిహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో ప్రైవేటు సంస్థ నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన జలవిహార కేంద్రానికి తొలి నుంచి సమస్యలు వెంటాడుతున్నాయి. 2017లో ప్రారంభమైన కేంద్రం బాలారిష్టాలతో అపసోపాలు పడుతోంది. 2019లో కొవిడ్ ప్రభావంతో దాదాపు రెండేళ్లపాటు దీన్ని ఏకంగా మూసేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. పర్యాటకులకు ఎటువంటి అనుభూతిని కల్పించలేక దూరమవుతోంది.
అసలుకే ఎసరు
జలవిహార కేంద్రంలో 2022లో జరిగిన ప్రమాదం వల్ల దీన్ని ఏకంగా మూసేశారు. పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు చనిపోగా...ఆరుగురు అప్పట్లో గాయపడ్డారు. ప్రమాదం అనంతరం చర్యలు చేపట్టిన అధికారులు నిర్వాహకులను బాధ్యుల్ని చేస్తూ కేసు నమోదు చేశారు. ఏకంగా కేంద్రాన్ని మూసేశారు.
ఏడాది గడిచినా
మూతపడిన కేంద్రాన్ని తెరిపించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త గుత్తేదారు ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి వీలుగా 2023 నవంబరులో టెండర్లు పిలిచారు. పాత గుత్తేదారుకు నిర్వహణ కాలపరిమితి ఉండటంతో న్యాయస్థానం ద్వారా ఆయన నిలుపుదల ఉత్తర్వులు తెచ్చారు. దీంతో కేంద్రం ప్రారంభం వ్యవహారం మరోసారి ఆగిపోయింది. గతంలో సగటున రోజుకు వంద మంది పర్యాటకులు జలవిహారం చేసేవారు. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోయిందని అంతా ఆందోళన చెందుతున్నారు.
తుప్పు పట్టిన బోట్లు..
దాదాపు రూ.60 లక్షలతో సమకూర్చిన బోట్లు పనికిరాకుండా పోతున్నాయి. తుప్పుపడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన భవనం పాడవుతోంది. పిల్లలు ఆడుకునే పరికరాలు కళావిహీనంగా మారాయి. జలవిహార కేంద్రం ఆధారంగా ఉపాధి పొందుతున్న దాదాపు 30 మంది ఉపాధికి దూరమయ్యారు.
అందనంత దూరంలో..
వానాకాలంలో ఎత్తైన కొండలపై నుంచి జాలువారే జలపాతాలు స్థానికులకు కనువిందు చేస్తాయి. జలాశయంలో బోట్లు ద్వారా ఎందరో పర్యాటకులు జలపాతాల దగ్గరికి వెళ్లి ఎంతో అనుభూతిని పొందేవారు. ప్రస్తుతం బోట్లు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ పర్యాటక కళ తప్పుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్