ఇంటర్ విద్య.. వసతులు మిథ్య
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస సదుపాయాలు కానరావడం లేదు. నాడు-నేడు కింద విద్యాలయాల రూపురేఖలు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది.
తీవ్రంగా వేధిస్తున్న గదుల సమస్య
అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస సదుపాయాలు కానరావడం లేదు. నాడు-నేడు కింద విద్యాలయాల రూపురేఖలు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. పలు ప్రాంతాల్లో పక్కా భవనాలు కరవయ్యాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆదర్శ, ఎయిడెడ్, కేజీబీవీ తదితరాలు కలిపి మరో 119 వరకు ఉన్నాయి. అరకొర సదుపాయాల నడుమే ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. చాలా విద్యాలయాల్లో గదుల కొరత ఉంది. నాడు-నేడు కింద చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు లేవు. కేజీబీవీల్లో ఏళ్లుగా అధ్యాపకుల కొరత వేధిస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు.
ఒక్క పైసా ఇస్తే ఒట్టు
ఉమ్మడి జిల్లాలో నాడు-నేడు రెండో విడత పనుల్లో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాలోని 23 జూనియర్ కళాశాలలను ఎంపిక చేశారు. రెండేళ్ల కిందటే ఎంపిక జరిగినా ఇంతవరకు ఒక్క కళాశాలలో కూడా పనులు ప్రారంభం కాలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు తదితర పనులకు రూ.176 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇంతవరకు పైసా నిధులు విడుదల కాలేదు.
కేజీబీవీలదీ అదే పరిస్థితి
ఉమ్మడి జిల్లాలోని 53 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో పూర్తిగా అతిథి అధ్యాపకులతోనే పాఠాలు బోధిస్తున్నారు. చిప్పగిరి, కౌతాళం, హాలహర్వి కేజీబీవీల్లో గతేడాది సున్నా ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాదీ మెరుగుపడలేదు. ఇక్కడ చాలాచోట్ల ప్రయోగశాలలు సరిగ్గా లేవు. అవసరమైన బోధన సిబ్బంది లేకపోవడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
నిర్మాణాలు సాగక..
ఇది జిల్లా కేంద్రమైన నంద్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఈ విద్యాలయంలో నూతన గదుల నిర్మాణానికి చేపట్టిన పనులు గత నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. గదుల కొరత తీవ్రంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది నిర్మాణంలో ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహించారు. ఇక్కడ మొత్తం ఆరు గదుల అవసరం ఉంది. గదులు లేకపోవడంతో గత పదేళ్లుగా రెండు గదుల రేకుల షెడ్డులోనే విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో ఇలా..
- బండి ఆత్మకూరులోని జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరింది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు గదులు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
- శిరివెళ్ల మండలం యర్రగుంట్ల కళాశాల కూలిపోయే దశలో ఉంది. ఇక్కడ సరైన ప్రయోగశాలలు అందుబాటులో లేవు. అధికారులు దృష్టి సారించని పరిస్థితి.
- కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులతోపాటు వసతులు కానరావడం లేదు.
- ఆత్మకూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలు రెండు ఒకే ఆవరణలో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్