logo

Kurnool: ఎగువ అహోబిలంలో ఘనంగా రథోత్సవం

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ మాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 21 May 2024 17:17 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ మాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో మంగళవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో భాగంగా జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి  అర్చకులు స్వామిని రథం చుట్టూ ఊరేగించి రథంపై కొలువు దీర్చారు. భక్తులు పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు