నాడితప్పిన ఇంటింటి వైద్యం
వైద్యులు ఇంటింటికెళ్లడం లేదు. విద్యార్థులనూ కేంద్రం వద్దకే రప్పిస్తున్నారు. అన్ని ‘పరీక్ష’లు చేయడం లేదు. నాలుగు మాత్రలు చేతిలో పెట్టి మమ అనిపిస్తున్నారు.
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: వైద్యులు ఇంటింటికెళ్లడం లేదు. విద్యార్థులనూ కేంద్రం వద్దకే రప్పిస్తున్నారు. అన్ని ‘పరీక్ష’లు చేయడం లేదు. నాలుగు మాత్రలు చేతిలో పెట్టి మమ అనిపిస్తున్నారు. ప్రజల ఆరోగ్య బాధ్యతను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ (కుటుంబ వైద్యుడు) పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని గత నెల 21న ఉమ్మడి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఆరోగ్య కేంద్రాల్లో అందే సేవలు నేరుగా గ్రామ స్థాయిలో అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది.
హెల్త్ వెల్నెస్ కేంద్రాలు : 841
ఎంఎల్హెచ్పీలు : 606
ఖాళీలు : 169
పీహెచ్సీలు : 87
104 వాహనాలు : 53
14 పరీక్షలు.. 69 రకాల ఔషధాలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యుల్లో ఒకరు గ్రామాలకు వెళ్లాలి. నెలలో ఒక్కో కేంద్రాన్ని రెండుమార్లు సందర్శించాలి. ఓపీ చూసి రోగులకు అవసరమైన మందులను ఇవ్వాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నవారిని మెరుగైన చికిత్సకు సిఫార్సు చేయాలి.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి అంగన్వాడీ, పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆ తర్వాత వైద్యశాలకు రాలేక ఇంటి పట్టునే ఉన్న రోగుల వద్దకు వెళ్లి వైద్యమందించాలి.
* 69 రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలి. రోగ నిర్ధారణకు 14 రకాల వైద్య పరీక్షలను చేయాల్సి ఉంటుంది.
* ఏ గ్రామానికి వైద్యులు వెళ్తారో అక్కడ 104 వాహనం అందుబాటులో ఉండాలి. వైద్యులు రాని రోజు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) వెల్నెస్ కేంద్రంలో ఉండి రోగులను పరీక్షించాలి.
జరుగుతున్న తీరు ఇది
రుద్రవరం మండలం కోటకొండలో సచివాలయంలోనే రక్త పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది
* కుటుంబ వైద్య ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) సిబ్బంది కొరత ఉంది. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కొన్నిచోట్ల కేవలం 4 రకాల పరీక్షలే నిర్వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పీహెచ్సీలకు పంపుతామంటున్నారు.
* వైద్యులు 104 వాహనంతోపాటు సచివాలయంలో ఉండి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ఇంటింటికెళ్లడం లేదు. మధ్యాహ్నం వరకు ఉండి తిరుగుబాట పడుతున్నారు. రుద్రవరం మండలం కోటకొండలో గురువారం రోగులను ఇంటి వద్ద పరీక్షించుకుండా దండోరా వేయించి సచివాలయానికే రప్పించి పరీక్షించడం గమనార్హం. చాలా చోట్ల అంగన్వాడీ, పాఠశాలలకు వెళ్లడం లేదు.
పాఠశాల విద్యార్థులే శిబిరానికి వచ్చి..
వైద్య సేవలకు రైతు భరోసా కేంద్రానికి వచ్చిన పాఠశాల విద్యార్థినులు
డోన్ మండలం దేవరబండలో గురువారం నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో వైద్యాధికారులు పాఠశాల వద్దకు వెళ్లలేదు. ఎస్సీ కాలనీలోని రైతుభరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, 104 వాహనం వద్దకే విద్యార్థులు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ చూసి మధ్యాహ్నం నుంచి పాఠశాల, అంగన్వాడీ తదితర ప్రాంతాలకు వెళ్లి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మధ్యాహ్నం ఓబులాపురం గ్రామానికి వెళ్లటంతో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొన్నారు.
న్యూస్టుడే, డోన్
మా ఇంటికి రాలేదు
మల్లేశ్వరమ్మ, దొడ్డిమేకల, పెద్దకడబూరు
రెండేళ్ల నుంచి దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నా. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్దకు నెలకోసారి 104 వాహనం వస్తుంది. అక్కడిదాకా వెళ్లి వైద్యం చేయించుకోవడం నా వల్ల కాదు. నడిచి వెళ్లాలంటే ఆయాసం పెరుగుతుంది. వాహనం వద్దకు వెళ్తే వైద్యం చేస్తారు. ఆశా కార్యకర్తలను మందులు అడిగితే లేవంటున్నారు.
న్యూస్టుడే, పెద్దకడబూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి