స్మార్ట్ టౌన్షిప్లపై అధికార పెత్తనం
నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలకు ఇళ్ల పట్టాలు సమకూర్చే పథకం నేతలకు భరోసాగా మారింది. విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేసి వాటినే ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’కు సిఫార్సులు చేస్తున్నారు. లే-అవుట్లు వేశాక మధ్య తరగతి పేరుతో దక్కించుకునేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి
ఎమ్మిగనూరు: బనవాసి క్షేత్రంలో యంత్రాలతో చదును చేస్తున్నారు ఇలా
ఈనాడు - కర్నూలు: నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలకు ఇళ్ల పట్టాలు సమకూర్చే పథకం నేతలకు భరోసాగా మారింది. విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేసి వాటినే ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’కు సిఫార్సులు చేస్తున్నారు. లే-అవుట్లు వేశాక మధ్య తరగతి పేరుతో దక్కించుకునేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మరికొందరు తమ భూములనే రైతుల ముసుగులో ప్రభుత్వానికిచ్చి భారీగా పరిహారం పొందేందుకు పావులు కదుపుతున్నారు. అనుకున్నట్లు ఆమోదముద్ర వేసుకోవడానికి అధికారంతో చక్రం తిప్పుతున్నారు. ఈ జాప్యాల నడుమ ఎంఐజీ-లేఅవుట్లు నిజమైన లబ్ధిదారులకు సకాలంలో అందక అందనిద్రాక్షగా మిగులుతున్నాయి.
నేతల భూములిచ్చేలా...
నంద్యాల జిల్లాలో లే-అవుట్లకు నేతల భూములే సేకరించేలా పావులు కదిపారు. గతేడాది ఓ నియోజకవర్గంలో 40 ఎకరాలు రైతుల నుంచి బినామీ పేర్లతో ముందే కొనుగోలు చేసి, ఆపై స్మార్ట్టౌన్షిప్లకు ఇచ్చేలా అడుగులు వేశారు. ఎకరాకు ఏకంగా రూ.1.20 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ప్రతిపాదనలు చేసి ముందుకు కదిపే యత్నాలు చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చాక విమర్శలు రావడంతో దీనిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇక్కడ మధ్యతరగతి వర్గాల్లో ఈ లే-అవుట్లపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కర్నూలు గ్రామీణ పరిధిలో నిడ్జూరులో టౌన్షిప్కు అడుగులు వేశారు. ఇక్కడ భూములకు పరిహారం భారీగా అడుగుతుండటంతో పక్కనబెట్టేసినట్లు సమాచారం.
బనవాసి క్షేత్రంలో 110 ఎకరాలు
ఎమ్మిగనూరు పరిధిలో బనవాసి క్షేత్రం భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇప్పటికే చేనేత క్లస్టర్కు కేటాయించిన 95 ఎకరాల్లో జగనన్న కాలనీలకు కేటాయించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. తాజాగా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరిట 110 ఎకరాలు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఆదోని-ఎమ్మిగనూరు రెండు మున్సిపాల్టీలకు సంబంధించి 13వేలకుపైగా ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళికలు చేశారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు పది శాతం, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం, ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వర్గాలకు మిగిలిన 75 శాతం ప్లాట్లు కేటాయించాల్సి ఉంటుంది. అరుదైన వనాలున్న బనవాసి భూములు ప్రధాన జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్నాయి. ఈ విలువైన భూములను మధ్యతరగతి పేరుతో నేతలు కొట్టేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
అడుగులు పడింది అక్కడే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో 14.50 ఎకరాలు భూ సేకరణ చేశారు. బేతంచెర్ల సమీపంలో బుగ్గానిపల్లెలో 12.50 ఎకరాలు ఒక్కో ఎకరా రూ.53 లక్షలు చెల్లించి తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు బనవాసి వద్ద 110 ఎకరాలు కేటాయించారు. ఆత్మకూరు కరివేన ఎస్సార్బీసీ ఎదురుగా 32 ఎకరాలు రైతుల నుంచి సేకరించే పనిలో ఉన్నారు. 18 మంది రైతులకు సంబంధించిన ఈ భూమికి ఎకరా రూ.60 లక్షల పరిహారం డిమాండ్ చేస్తుండగా, రూ.50 లక్షలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నట్లు కొందరు రైతులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం