logo

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరేశ్‌(32) అనే యువకుడు మృతిచెందాడు

Published : 29 Nov 2023 05:12 IST

ఆదోని నేరవార్తలు, గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరేశ్‌(32) అనే యువకుడు మృతిచెందాడు. గోనబావి గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న, ఈరమ్మ దంపతులకు నలుగురు కుమారులు. మూడో కుమారుడు వీరేశ్‌ బేల్దారుగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం వీరేశ్‌ ద్విచక్రవాహనంపై ఆదోని పట్టణానికి వెళ్తుండగా ముందు వెళ్తున్న ఎద్దులబండిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన జరిగిన సమయంలో అదే దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వాహనాన్ని నిలిపి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వీరేశ్‌ మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలుకా ఎస్సై ఎర్రిస్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని