logo

క్షణికావేశంతో యువకుడి ఆత్మహత్య

కర్నూలు గురుబ్రహ్మనగర్‌కు చెందిన వడ్డె సందీప్‌ (23) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. అతని తల్లిదండ్రులు చనిపోవటంతో తాత.. అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనుమాపురానికి చెందిన వడ్డె సన్నప్పయ్య పెంచి పెద్ద చేశారు.

Published : 29 Nov 2023 05:15 IST

సందీప్‌ (పాత చిత్రం)

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు గురుబ్రహ్మనగర్‌కు చెందిన వడ్డె సందీప్‌ (23) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. అతని తల్లిదండ్రులు చనిపోవటంతో తాత.. అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనుమాపురానికి చెందిన వడ్డె సన్నప్పయ్య పెంచి పెద్ద చేశారు. ఉరవకొండకు చెందిన త్రివేణిని సందీప్‌ మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కర్నూలులో ఉంటున్న వీరికి నెలన్నర కిందట కుమార్తె జన్మించింది. ఉదయం గ్యాస్‌ సిలిండర్‌ విషయంలో భార్యతో గొడవపడిన అతను క్షణికావేశంలో ఫ్యానుకు ఉరేసుకున్నారు. కుటుంబసభ్యులు కిందకి దింపి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని