నిర్వహణ చతికిలబడింది
సుద్దముక్కలకు రూ.2 వేలు, విద్యుత్తు బిల్లు రూ.8 వేలు, స్టేషనరీ రూ.2 వేలు ఇలా నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పాఠశాల నిర్వహణకు ఖర్చు అవుతోంది
డోన్ పట్టణం, కర్నూలు విద్య, న్యూస్టుడే: ‘‘ సుద్దముక్కలకు రూ.2 వేలు, విద్యుత్తు బిల్లు రూ.8 వేలు, స్టేషనరీ రూ.2 వేలు ఇలా నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పాఠశాల నిర్వహణకు ఖర్చు అవుతోంది. గతేడాది మంజూరైన నిధులు డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ ఏడాది ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు.. సొంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని 1,120 మంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆవేదన ఇది.!!
ఆరునెలలు దాటినా స్పందన లేదు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,934, ప్రాథమికోన్నత 351, ఉన్నత 601 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 4,65,735 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిర్వహణకు సంబంధించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా సమగ్ర శిక్ష నిధులు మంజూరు చేస్తుంది. 30 లోపు విద్యార్థులంటే రూ.10 వేలు, 30-100 మధ్య ఉంటే రూ.25 వేలు, 100-250 ఉంటే రూ.50 వేలు, 250-1000 మధ్య విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.75 వేలు పాఠశాలల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు దాటింది. నేటికీ పాఠశాల నిర్వహణ నిధులు ప్రభుత్వం ఇవ్వలేదు. బోధన సామగ్రి, విద్యుత్తు బిల్లులకు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
గతేడాది వెనక్కి తీసుకున్నారు
గతేడాది ఐదు విడతలుగా ఇస్తామన్నారు. ఆగస్టులో రూ.2.33 కోట్లు విడుదల చేశారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్)లో వేయడంతో కొందరు డ్రా చేసుకోగా, మరికొందరు చేసుకోలేకపోయారు. పీఎఫ్ఎంఎస్లో ఎంటర్ చేసుకుని డ్రా చేసుకోవాలంటే తీవ్ర జాప్యం అవుతోంది. 2023 ఫిబ్రవరిలో మరో 20 శాతం నిధులు మంజూరు చేయగా కర్నూలు జిల్లాలో రూ.1.27 కోట్లు, నంద్యాలలో రూ.86.85 లక్షలొచ్చాయి. ఇంకా రూ.7.77 కోట్లు రావాల్సి ఉంది. విడుదలైన నాలుగైదు రోజులకే వెనక్కి తీసుకున్నారు.
నాడు - నేడుతో పెరిగిన ఖర్చులు
మన బడి నాడు-నేడు కింద అదనపు గదులు పూర్తైన పాఠశాలల్లో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. 100- 200 మంది విద్యార్థులున్న పాఠశాలలకు గతంలో నెలకు రూ.1,500- రూ.2 వేల వరకు ఖర్చయ్యేది... ప్రస్తుతం రూ.4 వేలకుపైగా ఖర్చవుతోందని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు..నేడు అంటూ తరగతి గదుల్లో పంకాలు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, ఎఫ్టీ ప్యానళ్లు, ఆర్వో ప్లాంటు వంటి వాటికి విద్యుత్తు వినియోగం ఎక్కువైంది. గతంలో రూ.వందల్లో ఉన్న విద్యుత్తు బిల్లులు ఇప్పుడు రూ.వేలల్లో వస్తుండటంతో చెల్లించేందుకు హెచ్ఎంలు తంటాలు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి
[ 27-07-2024]
ఎస్పీ జి.బిందు మాధవ్ ఆర్టీసి, ట్రాన్స్కో, నేషనల్ హైవే అథారిటీ, మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి