తాళం వేసిన ఇళ్లకు కన్నం
ఆదోని పట్టణ శివారులోని తిరుమలనగర్, బాబా గార్డెన్ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 22 తులాల బంరం, 50 తులాల వెండి, రూ.2.55 లక్షల నగదు దోచుకెళ్లిళ్లారు. బాధితులు, ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేస్తున్న సాకరే పద్మావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లారు.
బంగారం, వెండి ఆభరణాలు, నగదు మాయం
పద్మావతి ఇంట్లో బీరువాను పగులగొట్టి చెలాచెదురుగా పడేసిన సామగ్రి
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: ఆదోని పట్టణ శివారులోని తిరుమలనగర్, బాబా గార్డెన్ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 22 తులాల బంరం, 50 తులాల వెండి, రూ.2.55 లక్షల నగదు దోచుకెళ్లిళ్లారు. బాధితులు, ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేస్తున్న సాకరే పద్మావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లారు. దొంగలు ఇంట్లో బీరువాను, అల్మారాలను పగులగొట్టి అందులో ఉంచిన సుమారు పది తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి శివరామిరెడ్డి తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి ఈ నెల 1వ తేదీన బెంగళూరులో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఇంట్లో బీరువాలో ఉంచిన సుమారు పది తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.86 వేలు ఎత్తుకెళ్లిపోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కాలనీలో సీఆర్పీఎఫ్ జవాను గురురాజా, స్రవంతి దంపతులు నివాసం ఉంటున్నారు. గురురాజా విధుల్లో ఇతర రాష్ట్రంలో పనిచేస్తుండగా స్రవంతి తన తల్లిగారి ఇంటికి శనివారం ఉదయం వెళ్లారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉంచిన రూ.65 వేలు నగదుతో పాటు, రూ.25 వేలు విలువ చేసే సెల్ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితురాలు పేర్కొన్నారు. ఫెస్టిసైడ్స్ సేల్స్మెన్ గోపాల్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం రాత్రి వెళ్లారు. తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో గోపాల్రెడ్డి ఇంట్లో నుంచి శబ్దం రావడంతో సమీపంలోని ఇళ్ల వారు గోపాల్రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆయన తన ఇంటి వద్ద ఉన్న బంధువులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకునే లోపే దొంగలు పరారయ్యారన్నారు. ఆయన ఇంట్లో రెండు తులాల బంగారం, 50 తులాల వెండితోపాటు రూ.50వేల నగదు, ఇక్కడ ఇంటి ఆవరణలో ఉన్న విశ్వనాథ్శెట్టి ఇంట్లో సైతం దొంగ చొరబడి బీరువాలో రూ.4వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి, మూడో పట్టణ సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సై జయశేఖర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్