పత్తి పరిశ్రమల బేలచూపు
ఒకప్పుడు కళకళలాడిన పత్తి పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరాయి. వాణిజ్య పరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో ప్రసుత్తం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పత్తి వ్యాపారం కారణంగా..
పూర్తిగా పడిపోయిన దిగుబడులు
నష్టాలతో సతమతమవుతున్న వ్యాపారులు
ఆదోని యార్డులో అరకొరగా పత్తి దిగుబడులు
ఆదోని మార్కెట్, న్యూస్టుడే: ఒకప్పుడు కళకళలాడిన పత్తి పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరాయి. వాణిజ్య పరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో ప్రసుత్తం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పత్తి వ్యాపారం కారణంగా.. పదుల సంఖ్యలో పరిశ్రమలు స్థాపించారు. భారీగా దిగుబడులు వచ్చేవి. ప్రస్తుతం సరకు అరకొరగా ఉండటంతో ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి.
దిగువకు దూది కండి ధరలు
గతేడాది దూది కండి ధర రూ.లక్ష వరకు పలికింది. అప్పుడు పత్తి ధర క్వింటా రూ.12 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో దూది కండి ధర రూ.55 వేలు, గింజలు క్వింటా రూ.3,100 మాత్రమే పలుకుతోంది. వస్త్ర ఉత్పత్తి లేక దారానికి డిమాండ్ తగ్గింది. మూడేళ్ల కిందట ఆదోనిలో ఉన్న పరిశ్రమలు 5-6 లక్షల వరకు పత్తి బేళ్లు ఉత్పత్తి చేస్తే.. గతేడాది రెండున్నర లక్షలు ఉత్పత్తి మాత్రమే చేయగలిగాయి.
ప్రభుత్వాలు ఆదుకోక..
ఇంతటి సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం ఆదుకోవడం లేదు. విద్యుత్తు డ్యూటీ ఒకప్పుడు యూనిట్పై 6 పైసలు ఉండగా ప్రస్తుతం రూపాయికి చేరింది. గతంలో కొత్త పరిశ్రమలకు ఐదేళ్ల పాటు రాయితీలు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇవి అమలుకావడం లేదు.
కార్మికులకు ఉపాధి కరవు
ఒక్కో పత్తి పరిశ్రమలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా 150-200 మంది కార్మికులకు ఉపాధి లభించేది. ప్రస్తుతం పత్తి దిగుబడులు లేక చాలా పరిశ్రమలు నడవడం లేదు. ఫలితంగా వీరికి ఉపాధి కరవైంది. పత్తి పరిశ్రమలు నడిస్తే ఒక్కో కార్మికుడికి రోజుకూలీ రూ.500కుపైగా వచ్చేది. ప్రసుత్తం వారి పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు ఐదు వేల మంది కార్మికులు అర్ధాకలితో అవస్థలు పడుతున్నారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో..
పత్తి సాగుకు వర్షమే ఆధారం. సాగైన పత్తి ఆదోని మార్కెట్యార్డుకు తెస్తే.. అక్కడి నుంచి వ్యాపారులు ఈ-నామ్ పద్ధతిలో కొనుగోలు చేసి పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ జిన్నింగ్ చేసి దూది, గింజలు వేరుచేస్తారు. దూదిని నూలు కోసం తమిళనాడు వంటి రాష్ట్రాలకు, గింజలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఒక్కో టీఎంసీ యూనిట్కు సరాసరి 1500-2000 క్వింటాళ్ల పత్తి దిగుబడులు అవసరం. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్కు రోజువారీగా వచ్చే పత్తి కేవలం 2 నుంచి 4 వేల క్వింటాళ్ల లోపే ఉంటోంది. ఫలితంగా చాలా పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి.
ఆదోని పరిధిలో పత్తి వ్యాపారం నమ్ముకుని సుమారు 50 వరకు టీఎంసీ (పత్తి పరిశ్రమలు) యునిట్లు నెలకొల్పారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడి కావాలి. ఇందులో చాలావరకు సొంత పెట్టుబడితో పాటు బ్యాంకు రుణాలతో పరిశ్రమలు స్థాపించారు. ప్రసుత్తం వీటి పరిస్థితి దయనీయంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే