కాల్వ భూములుకబ్జా
నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు.
వెంచర్లుగా మార్చి విక్రయం
నీటి ప్రవాహానికి ఆటంకం
నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని కేసీ కాల్వ శిఖం భూమి అక్రమార్కులకు ఫలహారంగా మారింది. భవిష్యత్తు అవసరాల కోసం చెరువుకు పక్కనే వదిలేసిన ఖాళీ స్థలాలు కట్ట నిర్మాణం, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఇప్పటికే స్థిరాస్తి వ్యాపారులు పంట కాల్వలను ఆక్రమించి విక్రయించారు. ఇప్పుడు అధికార పార్టీ అండతో ఏకంగా కేసీ కాల్వ శిఖం భూములను పొలాలుగా మార్చేస్తున్నారు. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నంద్యాల పట్టణం, న్యూస్టుడే
పంటకాల్వలు కనుమరుగు
నంద్యాల పట్టణంలో సర్వే నంబరు 869 నుంచి 2304 వరకు మూడు దశాబ్దాల కిందట 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 1900 నుంచి 2000 ఎకరాల వరకు కేసీ కాల్వ పంట కాల్వలు ఉన్నాయి. ప్రత్యేక శ్రేణి పురపాలకంగా మారినప్పటి నుంచి కాల్వ అక్రమణలు పెరిగిపోయాయి. పట్టణంలో సుమారు 12 కి.మీ మేర కనుమరుగయ్యాయి. ప్రత్యేకించి జగజ్జననీనగర్, చిన్నచెరువు కట్ట, ఆత్మకూరు బస్టాండు, బాలాజీ కాంప్లెక్స్, ఫరూక్నగర్, ఎస్బీఐ కాలనీ, ఎన్జీవోకాలనీ, నూనెపల్లె, రైతునగరం, కాంతినగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేసీ కాల్వ శిఖం భూమి ఆక్రమణలకు గురైంది. పట్టణాన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువు 750 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ రెండు చెరువుల శిఖం భూమి 50 ఎకరాలు ఉంది. ప్రస్తుతం అందులో సగానికి సగం కబ్జాకు గురైంది.
20 ఎకరాలు స్వాహా
కేసీ కాల్వ శిఖం భూమికి సంబంధించి సంబంధితశాఖ వద్దనే సరైన దస్త్రాలు, వివరాలు లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆక్రమణలకు బరి తెగించారు. సుమారు 12 కి.మీల పొడవున ఉన్న స్లూయిస్లు, కాల్వలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఆక్రమణల పర్వంతో సుమారు 20 ఎకరాల భూమిని స్థిరాస్తి వ్యాపారులు స్వాహా చేశారు. ఆ భూమికి రూ.300 కోట్లకు పైగా విలువ ఉంటుంది. బాలాజీ కాంప్లెక్స్లో పంట కాల్వలపై బహుళ అంతస్తుల నిర్మాణాలు, గ్రేటెడ్ కమ్యూనిటీ భవనాలు కనిపిస్తున్నాయి. ఫరూక్నగర్, జగజ్జననీనగర్, ఎస్బీఐకాలనీ, పద్మావతినగర్లలో ప్రస్తుతం సెంటు స్థలం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. రాజ్ థియేటర్ సమీపంలో చామకాల్వ వెడల్పు పెద్దదిగా ఉండగా.. దానికి 100 అడుగుల దూరంలో రెండు మీటర్ల వెడల్పూ కనిపించని పరిస్థితి నెలకొంది.
రూ.15 కోట్ల భూమికి రెక్కలు
నంద్యాల పట్టణం ఎస్బీఐ సమీపంలో పెద్ద చెరువు నీటిని స్లూయిస్ ద్వారా శిఖం భూమి మీదుగా పొలాలకు మళ్లిస్తున్నారు. ఇది కొంతకాలం కిందటి నుంచి అధికార పార్టీ నాయకుడి ముఖ్య అనుచరుడి చేతిల్లోకి వెళ్లింది. ఆయన దాన్ని చదును చేసి పొలంగా మార్చి కౌలుకు ఇచ్చారు. వరదల సమయంలో పాలేరు వాగు నుంచి వచ్చే వరద జలాలు ఈ స్లూయిస్ మీదుగా వెళ్లేందుకు వీలుకాక ఎక్కడిక్కడ నిల్వ ఉంటున్నాయి. మహానంది- నంద్యాల మార్గంలో రాకపోకలకు ఆటంకంగా మారుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.15 లక్షల వరకు ఉంది. అక్రమణకు గురైన భూమి ఎకరానికి పైగా ఉంది. రూ.15 కోట్లు విలువ చేసే భూమి అక్రమార్కుల చేతిలో ఉన్నా అధికారుల చర్యలు శూన్యం.
వీటినీ వదల్లేదు
- బాలాజీ కాంప్లెక్స్లో సుమారు రెండెకరాల భూమిని సెంట్ల ప్రకారం కొనుగోలు చేసిన అధికారపార్టీ నాయకుడు పంట కాల్వలను పూడ్చి తన స్థలంలో కలిపేసుకున్నారు.
- పద్మావతినగర్లోని పంట కాల్వలను మురుగుకాల్వలుగా మార్చివేసిన అధికార పార్టీకి చెందిన సొసైటీ యాజమాన్యం వాటిని సెంట్ల ప్రకారం పట్టణంలో పలుకుబడి ఉన్న వ్యాపారులు, రాజకీయ నాయకులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టింది.
- ఎస్బీఐ కాలనీలోని చామకాల్వ వెంట అధికారపార్టీకి చెందిన ఒక నాయకుడి అనుచరులు స్థలాలను బిట్లుగా విడగొట్టి తమ గుప్పెట్లో ఉంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి