మిరప కుప్పలు.. నిల్వకు తిప్పలు
రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు.
కల్లాల్లో పెద్ద ఎత్తున్న ఆరబోత
భయపెడుతున్న మిగ్జాం
రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు. కరవు కాలంలో పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పంట చేతికొచ్చింది.. మిరప కాయలు తీసి కల్లాల్లో ఆరబెట్టారు. కుప్పలపై పట్టాలు కప్పుతున్నారు.
న్యూస్టుడే, పెద్దకడబూరు
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: ‘కరవు’ పరిస్థితులకు ఎదురొడ్డి పంటలు పండించారు. చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులే దిక్కయ్యారు. ప్రస్తుతం తుపాను మేఘం కమ్ముకోవడంతో దళారులు ధరలు మరింత తగ్గించడంతో వరి, మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్లో మొక్కజొన్న 58,204 హెక్టార్లలో, వరి 62,788 హెక్టార్లు, మిరప 79793 హెక్టార్లలో సాగు చేపట్టారు. మొక్కజొన్న, వరి కోతలు పూర్తి అయ్యాయి.. గింజలు రోడ్లపై ఆరబోశారు. నంద్యాల జిల్లాలో 50,030 హెక్టార్లలో వరి సాగవ్వగా ఎక్కువగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉంది. ఏ రోడ్డుపై చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. మొక్కజొన్న పరిస్థితి ఇలానే ఉంది.. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 52,364 హెక్టార్లలో సాగు చేశారు. ప్రస్తుతం మిగ్ జాం తుపాను రైతులను వణికిస్తోంది. దీని ప్రభావం రెండ్రోజుల పాటు ఉంటుందని వాతావరణ నిపుణుల హెచ్చరికలు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు, పట్టలు అద్దెకు తెచ్చుకొని కుప్పలపై కప్పుతున్నారు. ధాన్యం తడిస్తే వ్యాపారులు ధర తగ్గిస్తారన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. ‘‘ తుపానుతో పంటకు నష్టం జరగడమో, ధాన్యం తడిసిపోవడమో జరిగితే జరిగిన నష్టానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. తడిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తుందని ’’ మార్క్ఫెడ్ నంద్యాల జిల్లా ఎండీ నాగరాజు పేర్కొన్నారు.
ఆళ్లగడ్డకు చెందిన ఓబులేసు ఎకరా పొలంలో నంద్యాల సోనా సాగు చేశారు. నాలుగు సంచుల దిగుబడి వచ్చింది. రూ.27 వేల వరకు పెట్టుబడి పెట్టా. రెండ్రోజుల కిందట ఒక సంచి (76 కిలోలు) రూ.2,300 పలికింది. తుపాను పేరు చెప్పి రూ.2,200కు తగ్గించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్