ఉర్దూ వర్సిటీపై జగన్ వివక్ష
ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని.
నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం
భూములు ఆక్రమించేందుకు యత్నాలు
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ధ్వజం
ఓర్వకల్లులోని ఉర్దూ విశ్వవిద్యాలయం వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న ముస్లిం మైనారిటీ నాయకులు
ఓర్వకల్లు, న్యూస్టుడే: ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని.. దీని అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రస్తుత వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించటం దురదృష్టకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ ధ్వజమెత్తారు. ఆయనతో పలువురు ఓర్వకల్లులోని ఉర్దూ వర్సిటీని సోమవారం సందర్శించి ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. తొలగించిన ఉర్దూ వర్సిటీ బోర్డును తిరిగి అక్కడే నిలబెట్టారు. ఆయన మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వం 2015లో 144 ఎకరాల విస్తీర్ణంలో అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ రహిమాన్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుసేన్, కార్యదర్శి అబ్దుల్ రజాక్, కర్నూలు నగర అధ్యక్షుడు ఉస్తాద్ ఇమ్రాన్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూర్, మహబూబ్బాషా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని