అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనపడకూడదు
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
కేంద్ర బృందం తనిఖీలకు వస్తోంది
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు హెచ్చరికలు
అధికారిణి ఆడియో వైరల్
ఈనాడు, కర్నూలు, న్యూస్టుడే, ఆదోని గ్రామీణం: అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గురు, శుక్ర, శనివారాల్లో కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన ఉంటుందని అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న 1886 అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఓ సీడీపీవో వివరించారు. ‘ఈనెల 7, 8, 9వ తేదీల్లో కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నాయి. వారు ఏ ప్రాజెక్టుకు, ఏ ప్రాంతానికి వస్తారో తెలియదు. ఆదోని, ఆస్పరి ప్రాంతాలకు రావచ్చని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇస్తున్న పదార్థాల ప్యాకెట్లుపై రాష్ట్ర ప్రభుత్వం తన బొమ్మలు వేసుకుంది. అలా ఉంటే కేంద్రం తదుపరి నిధులను విడుదల చేయదు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనబడడానికి వీల్లేదు. చార్టులు, ప్యాకెట్లు, బ్యాగులపై ఎక్కడా సీఎం బొమ్మ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని ముఖ్యమంత్రి చిత్రంపై తెల్లకాగితం అంటించవద్దు. ఆ ఫొటో ఉన్న ప్యాకెట్లు/చార్టులను అంగన్వాడీ కేంద్రం నుంచి మొత్తంగా తీసివేయాలి. బియ్యం, పప్పు, నూనె, బాలామృతం కేంద్రం నుంచి వస్తాయి. వైఎస్ఆర్ కిట్లు, గుడ్లు, పాలు రాష్ట్రప్రభుత్వం సరఫరా చేస్తుంది. దేన్ని ఎవరు సరఫరా చేస్తున్నారని అడిగితే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కచ్చితమైన సమాధానం చెప్పగలగాలి. ఏ ఒక్క కేంద్రంలో పాతప్యాకెట్లు ఉండకూడదు. దీంతోపాటు కేంద్రాల్లో ఉండే సరకుకు లెక్కలు కచ్చితంగా ఉండాలి. ప్రీస్కూల్ పిల్లలకు పాతప్యాకెట్లు వచ్చినట్లు తెలిసింది. ఆయా పాత ప్యాకెట్లు వస్తే వాటిని తెరిచి అందులోని పదార్థాలను ఏదైనా కంటైనర్లో పోసుకోవాలి. ఎవరైనా ఆయా సూచనల్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని పీడీ స్పష్టంగా చెప్పారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అంటూ ఆఖరులో హెచ్చరికలు చేయడం గమనార్హం. దీనిపై కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ సాధికారత అధికారిణి వెంకటలక్ష్మిని ‘ఈనాడు’ ప్రతినిధి సంప్రదించగా అంగన్వాడీ కార్యకర్తలు నిబంధనల ప్రకారం ఏ విధంగా విధులు నిర్వర్తించాలన్న విషయాన్ని గుర్తు చేశామని తెలిపారు. తాము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయమని, ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే