భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు
జిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
సమావేశంలో ఖాళీగా కుర్చీలు
కర్నూలు నగరం(జిల్లా పరిషత్), న్యూస్టుడే: జిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన కర్నూలు జడ్పీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీసంఘ సమావేశాలు నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు దిల్షాత్నాయక్, సీఈవో జి.నాసరరెడ్డి, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఏసీ గదిలో కూర్చుని ధరల నిర్ణయమా?
జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు తక్కువ ధర ఇవ్వడం సమంజం కాదని, ఏసీ గదుల్లో కూర్చుని ధరలు నిర్ణయించి, అన్యాయం చేయ్యెద్దని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అధికారులకు చురకలు వేశారు. కర్నూలు నుంచి గార్గేయపురం రహదారి ఏళ్ల తరబడి కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఎకరా రూ.కోటికిపై పైగా పలుకుతుండగా, రూ.15 లక్షలకు మించి పరిహారం ఇవ్వడం లేదన్నారు. నంద్యాల జిల్లాలో జల్జీవన్ మిషన్ పనులకు టెండర్లను ఎందుకు వేయడం లేదని, ప్రగతి వేగం పుంజుకోవడం లేదని కాటసాని అసహనం వ్యక్తం చేశారు.
జగనన్న కాలనీలపై సభ్యుల అసహనం
గ్రామాలకు దూరంగా జగనన్న కాలనీల్లో గృహాలు కేటాయించడంతో లబ్ధిదారులకు ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయిందని, అక్కడ వసతులు కల్పించినా ప్రయోజనం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో అడవిలో స్థలాలు కేటాయించారని, సొంతస్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అకాశమివ్వాలని జడ్పీటీసీ సభ్యుడు సుధాకరరెడ్డి కోరారు. వెల్దుర్తిలోనూ ఇదే పరిస్తితి నెలకొందని జడ్పీటీసీ సభ్యుడు సుంకన్న తెలిపారు. పంట నష్టపరిహారంలో అర్హులకు న్యాయం చేయాలని చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి కోరారు. ప్యాపిలి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాంరెడ్డి అన్నారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయోజనాలు కలిగించే అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని జడ్పీ అధ్యక్షుడు పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు.
కోరం లేకున్నా సమావేశాలు
ఏడు స్థాయీసంఘ సమావేశాలకు సంబంధించిన నాలుగింటికి సభ్యుల కోరం లేకున్నా సమావేశాలు కొనసాగించే పరిస్థితి నెలకొంది. హాజరైన ఇద్దరు సభ్యులకు ఆయాశాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమావేశాలకు కాటసాని మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరుకాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!