గాలిమరల ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మేకల రాజేష్పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేకల రాజేష్
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మేకల రాజేష్పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అదే కంపెనీలో ఆలూరుకు చెందిన వైకాపా నాయకుడు హనుమయ్య సైతం అద్దెకు వాహనాన్ని పెట్టారు. కంపెనీ వారు మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు. దీనికి తోడు ఆ కంపెనీ స్థానంలో మరోటి వచ్చి చేరింది. వీరు సైతం రెండు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహించిన హనుమయ్య గాలిమరల కంపెనీ కార్యాలయానికి తాళం వేసుకుని వచ్చారు. ఈ విషయమై సూపర్వైజర్ మేకల రాజేష్ కంపెనీ అధికారులతో మాట్లాడి ఒక నెల అద్దెను ఖాతాలో జమచేశారు. అయినా కార్యాలయం తాళం ఇవ్వకపోవడంతో ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదని, తిరిగి మొలగవల్లికి వెళ్తుండగా.. హనుమయ్య, ఆయన సోదరుడు చంద్రతో పాటు మరికొందరు కాపుకాసి దాడికి పాల్పడ్డారని బాధితుడి సోదరుడు మేకల రంగనాథ్ విలేకరులకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మేకల రాజేష్ను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడు సైతం వైకాపా సానుకూలపరులు కావడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
మోసపూరిత హామీలతో నమ్మకద్రోహం
సీఎంపై ఠాణాల్లో ఫిర్యాదు
ఎస్సై సునీల్కు ఫిర్యాదుపత్రం అందజేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రవీణ్ తదితరులు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: పాదయాత్రలో మోసపూరితమైన హామీలిచ్చి విద్యార్థులకు నమ్మకద్రోహం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి బి.ప్రవీణ్ గురువారం నగరంలోని మూడు, నాలుగో పట్టణ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. సీఎం తన అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించాడన్నారు. 82 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 40 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నారని, అదీ రూ.15 వేల నుంచి రూ.13 వేలకు కుదించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయంబర్స్మెంటు ఇస్తే ఈ ప్రభుత్వం కేవలం 9 లక్షలు మందికే ఇస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులను చదువుకు దూరం చేశారన్నారు.
పోక్సో కేసులో నిందితులకు జైలుశిక్ష
కర్నూలు న్యాయవిభాగం, నేరవిభాగం న్యూస్టుడే: ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరు యువకులకు కోర్టు జైలు శిక్ష విధించింది. 2020 జనవరి 9న బాలిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా కర్నూలు మండలం ఉల్చాలకు చెందిన మధు, బోయ గణేష్ ఆమె చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లే యత్నం చేశారు. బాలిక వారి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోయింది. బాధితురాలి బంధువైన వృద్ధురాలు నిందితులను ప్రశ్నించగా ఆమెపై దాడి చేసి గాయపరిచారు. బాధితులు కర్నూలు తాలూకా పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కేసును విచారించి గురువారం నిందితులిద్దరికీ ఏడాది జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వెంకటేశ్వరరెడ్డి వాదించారు.
తండ్రి దెబ్బలకు మూడేళ్ల కొడుకు బలి
సంజు (పాత చిత్రం)
మహేశ్వరం, మంత్రాలయం, న్యూస్టుడే: తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని అమీర్పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన లలితమ్మకు సి.బెళగల్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన శివతో వివాహమైంది. బతుకుదెరువు కోసం వారు మహేశ్వరం పరిధిలోని అమీర్పేటకు వలస వచ్చారు. నాలుగేళ్ల ప్రణయ్, మూడేళ్ల సంజు, 6 నెలల పాప వారి సంతానం. శివ మేస్త్రీ పని చేస్తాడు. అతను పని మీద బయటకు వెళ్లగా.. సంజు ఇంట్లో నిద్రపోయాడు. లలితమ్మ.. తన ఆరు నెలల పాపను, ప్రణయ్ (4)ను వెంట తీసుకొని మార్కెట్కు వెళ్లింది. కొంతసేపటికి శివ ఇంటికి వచ్చి తలుపు తీయగా సంజు నిద్రలేచి నడుచుకుంటూ రోడ్డు ఎక్కాడు. బుజ్జగించినా.. వినకపోవడంతో ఇంట్లోకి లాక్కొచ్చి రెండుమూడు దెబ్బలు కొట్టాడు. తర్వాత కుటుంబ సభ్యులు సంజును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని లలితమ్మ కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి