గెలుపు కిరీటంలో పల్లెపగడాలు
క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు.
క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు
గుండ్లకొండ నుంచి జాతీయ స్థాయికి..
క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఈ ఏడాదిలో 20 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలకు, మరో ఇద్దరు జాతీయస్థాయి క్రీడలకూ ఎంపికయ్యారు. దేవనకొండ మండలం గుండ్లకొండలోని ఉన్నత పాఠశాల. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు.
న్యూస్టుడే, దేవనకొండ
ఎవరికి వారు ప్రత్యేకం..
దేవనకొండ మండలం గుండ్లకొండ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో ప్రత్యేకతను చాటుతున్నారు. అండర్-17 బాల్బ్యాడ్మింటన్లో తేజస్కుమార్(తొమ్మిదో తరగతి) నెల్లూరులో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జావీద్ (తొమ్మిదో తరగతి) అక్టోబర్ 15న ఛత్తీస్ఘడ్లో జరిగిన జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. ఆ పాఠశాలకు ఆట స్థలం లేదు.. క్రీడల్లో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడూ బదిలీ అయ్యారు. అయినా.. విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ సత్తా చాటుతున్నారు. విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజారావు, ఉపాధ్యాయులు ఉచ్చీరప్ప, సలీంబాషా, గ్రామస్థులు అభినందించారు.
జాతీయ స్థాయిలో తేజస్సు
గుండ్లకొండ గ్రామానికి చెందిన జాన్సన్, విజయకుమారి దంపతుల కుమారుడు తేజస్కుమార్ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నాడు. జాతీయ ఉపకార వేతనానికి కూడా ఎంపికయ్యాడు. బాల్బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెలలో ఛత్తీస్ఘడ్లో నిర్వహించే జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటాడు. గతంలో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయుల తర్ఫీదుతోనే ఆటల్లో మెలకువలు నేర్చుకున్నట్లు తేజస్ తెలిపాడు.
జయం మనదే జావీద్
బంటుపల్లికి చెందిన గోసంరక్షకులు చాంద్బాషా, షంషాద్బీ దంపతుల కుమారుడు జావీద్. ప్రస్తుతం గుండ్లకొండ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పాడిపరిశ్రమ, వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. జావీద్ జాతీయ ఉపకారవేతనానికి కూడా ఎపింకయ్యాడు. అక్టోబరు 15న జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొన్నాడు. అక్కడ ప్రథమస్థానంలో నిలిచాడు.
నిత్య సాధనలో నవనీత్
గుండ్లకొండకు చెందిన రమణ, దేవీ దంపతుల కుమారుడ నవనీత్. కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మొదటిసారి అండర్-17లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్కు ఎంపికయ్యాడు. పాఠశాల ఆవరణలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తే.. పాఠశాల నుంచి ఇంకా క్రీడాకారులు సిద్ధమవుతారని నవనీత్ చెబుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటలో ఉద్యోగం సాధించి దేశ రక్షణకుడిగా సేవలు అందించాలనేది లక్ష్యమని అంటున్నాడు ఈ క్రీడాకారుడు.
శభాష్ కార్తిక్
కృష్ణ, లలిత దంపతుల కుమారుడు కార్తిక్. వ్యవసాయ కుటుంబం. మొదటిసారి ఎనిమిదో తరగతిలోనే జాతీయస్థాయి అండర్-14లో కబడ్డీకి ఎంపికయ్యాడు. ఈసారి ట్రిబుల్ జంప్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్