పాఠాలు బోధపడక
క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని.
క్లస్టర్ వర్సిటీ నుంచి వెళ్లిపోతున్న విద్యార్థినులు
భారీగా మిగిలిపోయిన పీజీ సీట్లు
నగరంలోని కె.వి.ఆర్. మహిళా డిగ్రీ కళాశాల
ఈనాడు, కర్నూలు : క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని.. వేరే విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ను విద్యార్థినులు ఆశ్రయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
క్లస్టర్ వర్సిటీ పరిధిలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు తాము వేరే వర్సిటీకి వెళుతామంటూ దరఖాస్తు చేసుకున్నారు. వారు ముగ్గురూ ఎమ్మెస్సీ (జువాలజీ) చదువుతున్నవారే కావడం గమనార్హం. ఇందులో ఇద్దరు తిరుపతిలోని ఎస్వీ, పద్మావతి మహిళా వర్సిటీలకు, మరొకరు కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా జువాలజీ విభాగంలో కేవలం ఐదుగురు మాత్రమే చేరినట్లు తేలింది. మీకేం పాఠాలు చెబుతామని కొందరు అధ్యాపకులే నిరాశ వ్యక్తం చేయడం.. అవకాశముంటే వేరే వర్సిటీకి వెళ్లిపోవాలంటూ వారు సూచించినట్లు వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి వెళ్లింది.
సమన్వయ లోపంతో..
- నగరంలోని సిల్వర్జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర కళాశాలలను ప్రభుత్వం క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిధిలోకి తెచ్చింది. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను నియమించి వారి ఆధ్వర్యంలో ఆయా కళాశాలలు కొనసాగేలా చట్టం చేశారు. వీటిల్లో ప్రవేశాలు సైతం వర్సిటీయే నిర్వహిస్తోంది. మరోవైపు వివిధ నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రిన్సిపాళ్లకు, వీసీ, రిజిస్ట్రార్లకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి.
- క్లస్టర్ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్పై కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాశాంతి మైనార్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మైనార్టీ కమిషన్ నుంచి రిజిస్ట్రార్కు నోటీసులు అందాయన్న విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
తగ్గిపోతున్న పిల్లల సంఖ్య
క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు కళాశాలల్లో 400కు పైగా సీట్లు ఉన్నాయి. కొన్ని పీజీ కోర్సుల్లో 30 సీట్లు, మరికొన్నింటిలో 40 సీట్ల చొప్పున ఉన్నాయి. వీటికి అదనంగా ఇ.డబ్ల్యు.ఎస్. కోటా కింద మరికొన్ని సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ అన్ని కోర్సుల్లో కలిపి 63 మంది విద్యార్థులు మాత్రమే చేరడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరిన దాఖలాలు లేవు. దశాబ్దాల చరిత్ర ఉన్న కె.వి.ఆర్. మహిళా డిగ్రీ కళాశాలలో చదివేందుకు గతంలో పలువురు పోటీ పడేవారు. ఇతర జిల్లాల విద్యార్థులు సైతం సీటు కోసం ప్రయత్నించేవారు. అలాంటి చరిత్ర ఉన్న కళాశాలలో ఎమ్మెస్సీ (జువాలజీ) కోర్సులో కేవలం ఐదుగురు మాత్రమే చేరడం గమనార్హం. ఈ క్రమంలో ఉన్నవారిలో ముగ్గురు ఇతర వర్సిటీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?