ఉత్తుత్తి సవాళ్లు.. అడుగడుగునా అక్రమాలు
నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు.
కుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్న వ్యాపారులు
నిలువునా మోసపోతున్న రైతులు
గిట్టుబాటు ధర లేక ఆటోలో సరకును వెనక్కి తీసుకెళ్తున్న రైతు
నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు. వారి రెక్కల కష్టాన్ని ‘గద్దల్లా’ తన్నుకుపోతున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేస్తున్నట్లు రైతులను మభ్యపెడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఈ నేపథ్యంలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులో మిర్చి యార్డు ఏర్పాటు చేసింది. పాణ్యం, గడివేముల, వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, మహానంది, శిరివెళ్ల, గోస్పాడు, బనగానపల్లి, అవుకు తదితర మండలాల నుంచి యార్డుకు రోజుకు సగటున 1,000 క్వింటాళ్ల మిర్చి విక్రయాలకు వస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రైతుల అవసరాలు.. మిర్చి రకాలను గుర్తించి కొందరు వ్యాపారులు అక్రమాలకు తెగబడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 15 వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం అంతకుమించి 80 వేల హెక్టార్లలో సాగైంది. ఫలితంగా దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.
సరకు వెనక్కి తీసుకెళ్లి..
ఈ పక్క చిత్రంలోని రైతు పేరు వాల్మీకి. కోవెలకుంట్ల మండలం అమడాల గ్రామానికి చెందిన ఇతను నంద్యాలలోని శీతల గిడ్డంగిలో మిర్చి నిల్వ చేశారు. యార్డులో సరకు విక్రయించేందుకు వస్తే కిలో రూ.150 నుంచి రూ.170 వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పారు. ఆ ధర గిట్టుబాటు కాకపోవడంతో తెచ్చిన సరకును అతను ఆటోలో తీసుకెళ్లిపోయారు. గోదాము నుంచి యార్డుకు సరకు తీసుకొచ్చే క్రమంలో హమాలీలు, ఆటో తదితర ఖర్చులన్నీ కలిపి బస్తాకు రూ.250 వరకు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సరకు అమ్ముడుపోకపోగా రవాణా ఛార్జీల భారం మరింత ఎక్కువైందని చెప్పారు.
తప్పుదోవ పట్టిస్తూ..
మిర్చి రకం గుర్తింపులోనే వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఎరుపు వర్ణంలో ఉండి మందంగా ఉన్న మిర్చిని డీలక్స్ రకంగా గుర్తించకుండా కొన్నిసార్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిబంధనల మేరకు యార్డుకు సరకు తీసుకొచ్చిన రైతు కుప్పలుగా వేస్తే వ్యాపారులు సవాల్ పాడుతుంటారు. ఎవరు ఎక్కువగా పాడితే వారికి సరకు సొంతమవుతుంది. కొందరు ముందుగానే ‘మిలాఖత్’ అయి వేలం పాట పాడినట్లుగానే నటిస్తూ ఎక్కువ ధరకు పాడకుండా ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. డీలక్స్ రకం ధరను రూ.200 నుంచి ప్రారంభించి రూ.215, కొన్నిసార్లు రూ.190కే పరిమితం చేస్తుండటం గమనార్హం. మీడియం రకం సరకును రూ.150 నుంచి రూ.160కు పాడుకుంటున్నారు. గంటలకొద్దీ సవాల్ నిర్వహించినా ధర మాత్రం పెంచడం లేదు.
వడ్డీలు పెరిగిపోతుండటంతో..
ఆరు నెలల కిందట బహిరంగ విపణిలో మిర్చికి మంచి ధర పలికింది. కిలో ధర రూ.240 వరకు వచ్చింది. మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది రైతులు తమ దిగుబడులను నంద్యాల, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లోని శీతల గోదాముల్లో నిల్వ ఉంచారు. కానీ ఆరు నెలలుగా ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎకరాకు రూ.1.20 లక్షలు పెట్టి మిర్చి సాగు చేయగా ధర క్రమంగా తగ్గుతూ వస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో చివరికి గోదాముల్లోని మిర్చిని యార్డుకు తరలిస్తున్నారు. మరోవైపు ధర క్రమంగా తగ్గిపోతుండటం.. ఇటు రైతుల అవసరాలు గుర్తించిన కొందరు వ్యాపారులు కమీషన్ ఏజెంట్లతో కుమ్మక్కయ్యారు. ప్రస్తుతం విపణిలో డీలక్స్ రకం మిర్చి కిలో రూ.210, మధ్యస్థ రకం రూ.150 నుంచి రూ.180 వరకు, తాల్ రకం రూ.80 నుంచి రూ.105 ధర ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్