బడుగులపై బకాయిల కత్తి
నా ఎస్సీలు...నా ఎస్టీలు..వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల సవతితల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు.
మంజూరైన ట్రాక్టర్ల వద్ద గిరిజన, దళితులు
నంద్యాల పట్టణం, చాగలమర్రి, న్యూస్టుడే: ‘నా ఎస్సీలు...నా ఎస్టీలు..వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల సవతితల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు. పేద, బడుగు, గిరిజన, దళితులకు ప్రయోజనం చేకూరుస్తామని ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం’ పథకం కింద వాహనాలను కొనుగోలు చేయించి రాయితీ మొత్తాలను అర్హుల ఖాతాలకు జమ చేయక వారిని కష్టాల ఊబిలోకి నెట్టేశారు. 2020-23 మధ్య ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసి బడుగులకు కష్టాలను మిగిల్చారు.
ఏటా ఆగస్టులో అన్నారు
జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం కింద అవసరమైన వాహనాల కొనుగోలుకు పరిశ్రమల శాఖ ద్వారా రుణాలను అందజేసింది. పథకం విలువలో 85 శాతం బ్యాంకు రుణంగా ఇస్తే మిగిలిన 15 శాతం లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. వాహనం విలువలో 45 శాతం రాయితీ మొత్తాన్ని రుణం ఇచ్చిన బ్యాంకుకు జమచేసి మిగతా మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో 11 శాతం వడ్డీతో లబ్ధిదారులు చెల్లించాలి. ఏటా ఆగస్టులో రాయితీ మొత్తం విడుదల చేస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి స్వయంగా హామీ ఇచ్చి మూడేళ్లయినా జమకాలేదు.
రూ.138 కోట్లకు తప్పని నిరీక్షణ
జగనన్న వైఎస్సార్ బడుగు వికాస్ కింద కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 300 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.63 కోట్లు కలిపి మొత్తం రూ.138 కోట్ల రాయితీ మొత్తం అందాలి. నంద్యాల జిల్లాలోని చాగలమర్రి, పాణ్యం, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, బేతంచెర్ల, అవుకు, కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ, ఆలూరు తదితర మండలాలకు చెందిన లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీల్లో ఎక్కువ మంది ఇన్నోవా, స్కార్పియో, తూఫాన్, టిప్పర్లు, జేసీబీలు, ఎస్టీలైతే ట్రాక్టర్లు, లారీలు, కార్లు తదితర వాహనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం రాయితీ విడుదల చేయకపోవడంతో బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేక, ఇచ్చిన వాహనాలు బేరాలు కుదరక నడపలేక లబ్ధిదారులు మల్లగుల్లాలుపడుతున్నారు. కర్నూలు, నంద్యాలలో కలెక్టర్ల అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక సలహా మండలి సమావేశంలో సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తావించినా స్పందన కరవైంది.
మేకలు అమ్ముకుని కంతులు కట్టా
-లక్ష్మమ్మబాయి, ఓజీ తండా
జగనన్న ప్రభుత్వాన్ని నమ్మి రాయితీ వస్తుందని ట్రాక్టరును కొన్నాం. వ్యవసాయం, గొర్రెల పెంపకమే ప్రధాన జీవనాధారం. రాయితీకి ఆశపడి ట్రాక్టరు కొనుగోలు చేసి కంతులు కట్టేందుకు దాదాపు 30 మేకలను అమ్మేశాం. ఆరు నెలలకు ఒక వాయిదాకు రూ.1.12 లక్షలు కట్టలేక ఇంట్లో దాచుకున్న డబ్బులు, బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి కట్టాం. ప్రభుత్వం ఇస్తామన్న రాయితీని జమచేయలేదు.
వడ్డీలు కట్టలేక ఇబ్బందులు
- రాజమహేంద్ర, జిల్లా పరిశ్రమల శాఖ కమిటీ సభ్యులు
2020-23లో పారిశ్రామిక పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ యువతకు ఇచ్చిన రుణాలకు సంబంధించి రాయితీ మొత్తం ఇంతవరకు జమకాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూత కోసం ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా రాయితీలు ఇవ్వలేదు. ప్రస్తుతం లబ్ధిదారులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి