దళితుల భూములపై కన్ను
‘ నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటూ వేదిలెక్కిన ప్రతిసారి చెప్పే జగన్.. తన ఏలుబడిలో వారు దగా పడుతున్నారు.
సాగు చేసుకోవద్దంటూ హెచ్చరికలు
తెర వెనుక కథ నడిపిస్తున్న పెద్దలు
పంప్హౌస్ నుంచి దళితుల పొలాల్లోకి ఇలా నీరు వదిలేశారు
ఈనాడు, కర్నూలు, కర్నూలు గ్రామీణం, న్యూస్టుడే : ‘‘ నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటూ వేదిలెక్కిన ప్రతిసారి చెప్పే జగన్.. తన ఏలుబడిలో వారు దగా పడుతున్నారు. ఆ పార్టీ నేతల భూదాహానికి బలవుతున్నారు. నిబంధనల కొర్రీలు పెట్టి దళితుల భూముల్లో పాగా వేయాలని చూస్తున్నారు. కర్నూలు నగర సమీపంలోని రూ.200 కోట్లు విలువ చేసే భూములపై ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కన్నేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సాగులో ఉన్న ‘ నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ అంటూ వేదిలెక్కిన ప్రతిసారి చెప్పే జగన్.. తన ఏలుబడిలో వారు దగా పడుతున్నారు.కు అధికారులతో మౌఖిక ఆదేశాలు జారీ చేయిస్తుండటం కలకలం రేపుతోంది. ‘‘ ఇటీవల కొందరు రైతులను పోలీసులు పిలిపించారు.. పొలాల్లోకి వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.. న్యాయస్థానాలకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెబుతున్నారు.. ఇదెక్కడి న్యాయమని సుంకన్న అనే రైతు ప్రశ్నిస్తున్నారు.
అనుభవంలో లేరని నిరూపించే ప్రయత్నం
ఆయా భూముల్లో రైతులు ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. వాటిని ఎలాగైనా లాక్కోవాలన్న ఉద్దేశంతో వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు ప్రారంభించారు. రైతులను సాగుకు దూరం చేసి.. వారి అనుభవంలో లేవని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా భూముల్లోకి సమీప ఎస్.ఎస్. ట్యాంకు నుంచి నీటిని వదులుతున్నారు. భూసేకరణ జరుగుతోంది.. పంటలు సాగు చేస్తే నష్టపోతారంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకు భూ సేకరణ చేయడం లేదో మాత్రం చెప్పడం లేదు. పందుల్ని తీసుకొచ్చి పొలాల్లో వదులుతుండడం... పొక్లెయిన్లతో భూములను ధ్వంసం చేయిస్తున్నారు. దీంతో బాధిత రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారికి తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారం. మరో ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. కేసీ కాల్వను ఆనుకునే భూములు ఉండటంతో నీటి కొరత లేదు. ఈ నేపథ్యంలో పచ్చగా ఉండాల్సిన భూములు భూబకాసురుల భూదాహం కారణంగా బీడు భూములుగా మారుతున్నాయి.
ఎందుకు సేకరిస్తున్నారో చెప్పరు
‘‘ మా పూర్వీకుల నుంచి తరతరాలుగా 4.5 ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. డీపట్టా ఉంది. భూసేకరణ చేస్తామని ప్రచారం చేస్తుండటంతో పంట వేయాలా? వద్దా? అన్న విషయం తేల్చుకోలేక భయాందోళనకు గురవుతున్నాం. మా భూములు మాకు దక్కుతాయా? లేదా? అన్న విషయం తెలియక తీవ్ర ఆందోళనతో ఉన్నాం. ఇప్పటికే ఓ మహిళ గుండెపోటుతో చనిపోయింది. భూసేకరణ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళనతో నిద్రపట్టక ఆరోగ్యం క్షీణిస్తోందని’’ దేవరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాల్వ భూమిగా దస్త్రాల్లో నమోదు
కర్నూలు మండలం మునగాలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 46/సీ, 50, 233, 236, 237, 238, 239, 240, 241, 243, 244, 245, 248, 249, 250, 252, 254, 255, 256, 257, 415, 416, 417, 418, 423, 430, 431, 432లో ఉన్న భూమి కాల్వ భూమిగా దస్త్రాల్లో నమోదై ఉంది. అక్కడ కొందరు దళిత రైతులకు గతంలో పట్టాలు ఇచ్చారు. వాటికి సంబంధించి పట్టాదారు పాస్పుస్తకాలు తీసుకోలేకపోయారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోలేదు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నారు. ఇవి కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఒకటిన్నర కి.మీ. పరిధిలో ఉన్నాయి. ఆయా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రహదారి పక్కన పొలాలైతే ఎకరా రూ.1.50 కోటి వరకు పలుకుతోంది. దాదాపు రెండు వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఉన్నాయి.
పోలీసులతో భయపెట్టిస్తున్నారు
‘‘ దశాబ్దాలుగా మేము మునగాలపాడులోని భూములు సాగు చేసుకుంటున్నాం..భూ పత్రాలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశా. ఆయా భూముల్లోకి రావొద్దని నగర పాలక అధికారులు పోలీసులతో చెప్పించి భయపెట్టిస్తున్నారు.. గతంలో ఎస్.ఎస్.ట్యాంకు పేరు చెప్పి 350 ఎకరాలు సేకరిస్తే దళిత రైతులే నష్టపోయారు. భూమిలో సాగు చేసే అవకాశం లేకుండా ఎస్.ఎస్.ట్యాంకు నీటిని వదిలారని’’ రామదాసు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి