పాతాళానికి జలం.. భోరుమంటున్న పల్లె జనం
ఆస్పరి మండల పరిధిలోని పుప్పాలదొడ్డిలో 270 వరకు ఇళ్లు ఉన్నాయి. 1,200 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి రెండు బోర్ల నీరే ఆధారం. వాటి నుంచి ట్యాంకుల్లో నిల్వ చేసి అందిస్తున్నారు.
ఆస్పరి మండల పరిధిలోని పుప్పాలదొడ్డిలో 270 వరకు ఇళ్లు ఉన్నాయి. 1,200 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి రెండు బోర్ల నీరే ఆధారం. వాటి నుంచి ట్యాంకుల్లో నిల్వ చేసి అందిస్తున్నారు. గ్రామస్థులంతా అక్కడికే వెళ్తారు. నీటి మట్టం తగ్గడంతో వచ్చే కొద్దిపాటి నీటికి గంటల సేపు నిరీక్షిస్తున్నారు. పదే పదే ట్యాంకుల వద్దకు వెళ్లలేక150 మంది రెండు చక్రాల తోపుడు బండ్లు తెప్పించుకున్నారు. ఒక్కో దానికి రూ.5 వేలు ఖర్చు వెచ్చించారు. ఒక్కోదాంట్లో ఆరు బిందెలు పెట్టి నీటిని తీసుకెళ్తున్నారు.
న్యూస్టుడే, ఆస్పరి
కర్నూలు నగరం, న్యూస్టుడే: మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.. బోర్లకు మరమ్మతులు చేయించేందుకు నిధుల్లేవు.. జల్జీవన్ పనులు ముందుకు సాగడం లేదు.. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు జడ్పీటీసీ సభ్యులు రెండు రోజుల కిందట జరిగిన సర్వసభ్య సమావేశంలో జనావేదన వినిపించారు. ఇందుకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లను ఆదేశించారు. చిల్లిగవ్వ లేకుండా ఎలా ముందుకెళ్లాలని పల్లె ప్రజాప్రతినిధులు, అధికారులు తలపట్టుకున్నారు.
300 గ్రామాల్లో ముప్పుతిప్పలు
ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు వందల గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు, బావుల్లో జలమట్టం అడుగంటిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వారం, పది రోజులకోసారి మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే పల్లెల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.కర్నూలు జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు గతేడాది తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. రూ.87.20 లక్షల మేర బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఓ సంస్థ ద్వారా రూ.27 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా.. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరుగుతోంది. పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో పది రోజులకోసారి మంచినీరు సరఫరా అవుతోంది.
రూ.22.75 కోట్లకు ప్రతిపాదన
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బోర్లకు మరమ్మతులు, ట్యాంకర్లతో రవాణా, బోరు బావులు అద్దెకు తీసుకోవడం తదితర వాటి కోసం రూ.22.75 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. కర్నూలు జిల్లాలో 112 గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.8.10 కోట్లు అవసరమని గతేడాది ప్రభుత్వానికి నివేదించినా ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!