వసతిగృహం.. శిథిలభవనం
నాడు- నేడు పేరుతో ప్రభుత్వం విద్యకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. వసతిగృహాల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులు నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు.
పత్తికొండలోని బీసీ బాలికల వసతిగృహ భవనం ఇది. ఇక్కడ 170
మంది విద్యార్థులు అసౌకర్యాలతో కుస్తీ పడుతున్నారు.
నాడు- నేడు పేరుతో ప్రభుత్వం విద్యకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. వసతిగృహాల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులు నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. వసతిగృహాల తీరు నేటికీ మారలేదు. పత్తికొండలోని బీసీ వసతిగృహ కొత్త భవనానికి ప్రహరీ లేకపోవడంతో బాలికలకు రక్షణ కరవైంది. తల్లిదండ్రుల విన్నపం మేరకు పాత భవనంలోకి మార్చారు. అసౌకర్యాలతో అవస్థలు పడుతున్నారు. పత్తికొండలోని బాలికల వసతిగృహంతో పాటు, మద్దికెరలోని ఎస్సీ వసతిగృహ భవనాలు నిరుపయోగంగా మారాయి. ఒక్కో భవనానికి రూ.80లక్షలకు పైగా వెచ్చించారు.
న్యూస్టుడే, పత్తికొండ, మద్దికెర
ఒకే భవనంలో 170 మంది
పత్తికొండలో ఒకే భవనంలో 170 మంది బాలికలు చదువుకుంటున్నారు. పాత భవనంలోని రెండు హాల్లలో.. సరైన సౌకర్యాలు, వసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారు కనీసం పడుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వసతిగృహ ఆవరణలోని చేతి పంపు వద్ద నుంచి బిందెలతో తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. అన్ని సౌకార్యలున్నా.. ప్రహరీ లేకపోవడంతో మరో భవనంలో ఉండాల్సిన 5 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులను సైతం అక్కడి నుంచి ఇంటర్ విద్యార్థులు ఉంటున్న వసతిగృహం భవనంలోకి మార్చడంతో అందరికీ అక్కడ అవసరమైన వసతులు కొరవడ్డాయి.
పత్తికొండలో నిర్వహణ లేక అధ్వానంగా మారిన బీసీ వసతిగృహం
ఆకతాయిల వేధింపులతో..
పత్తికొండలోని బీసీ వసతిగృహ భవనాన్ని మూడేళ్ల కిందట ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. ఆ భవనానికి ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిల చేష్టలతో బాలికలు ఇబ్బందులు పడేవారు. దీంతో ఇంటర్ కళాశాల పక్కన ఉన్న పాత భవనంలోకి మార్చారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వసతిగృహం భవనం నిరుపయోగంగా మారడంతో పాటు, అక్కడి విలువైన వస్తువులన్నీ చోరీకి గురయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో భవనం సైతం శిథిలావస్థకు చేరింది.
ఇక్కడ ఇలా..
మద్దికెరలో 2018లో ఎస్సీ వసతిగృహ భవనం ప్రారంభమైన ఆరు నెలలకే మూసివేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా మరో వసతిగృహంలో విలీనం చేశారు. దీంతో రూ.80లక్షలు వెచించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. ఇక్కడ చదివే విద్యార్థులు సవతి లేక అవస్థలపాలయ్యారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే