logo

బీసీలకు టికెట్ ఇవ్వాలి

వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు టికెట్ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులు మల్లికార్జున, ప్రభాకర్ నాయుడు, కొండయ్య అన్నారు.

Published : 23 Feb 2024 16:04 IST

ఎమ్మిగనూరు గ్రామీణం: వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు టికెట్ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులు మల్లికార్జున, ప్రభాకర్ నాయుడు, కొండయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాలులో బీసీ సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు పలువురు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారని, బీసీలకు రాజకీయ ప్రధాన పార్టీలన్నీ టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించాలన్నారు. సమావేశంలో నాయకులు మాచాని శివకుమార్, గడిగే లింగప్ప, శివలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని