logo

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల పంపిణీ

నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మార్చి 3 నుంచి 12వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

Published : 23 Feb 2024 16:07 IST

మహానంది: నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మార్చి 3 నుంచి 12వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కాపు చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర్ శర్మ, ఆలయ ఉప ప్రధానార్చకులు కొమ్మది శంకరయ్య ఆహ్వాన పత్రికలను అధికారులకు అందజేసి ఆహ్వానం పలికారు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లాకలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్.జి. రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాన్ని పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని