logo

వైకాపా వర్గపోరుతో ధ్వంస రచన

మద్దికెర వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఇటీవల ఉప సర్పంచి ప్రమీలమ్మ కారు అద్దాలు ధ్వంసం చేశారు.

Published : 24 Feb 2024 02:15 IST

మద్దికెర- బొజ్జనాయునిపేట గ్రామాల మధ్య ధ్వంసమైన శిలాఫలకం

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర వైకాపాలో విభేదాలు తారస్థాయికి చేరాయి.. ఇటీవల ఉప సర్పంచి ప్రమీలమ్మ కారు అద్దాలు ధ్వంసం చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా.. నేటికీ నిందితులను గుర్తించలేదు. మద్దికెర- బొజ్జనాయునిపేట గ్రామాల మధ్య రూ.2.5 కోట్లతో నిర్మించిన బీటీ రహదారిని ఈ నెల 20న ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు రోడ్డు పనులు చేశారు. శుక్రవారం శిలాఫలకాన్ని పగులగొట్టారు. పార్టీలో ఒకరిద్దరే పెత్తనం చెలాయిస్తున్నారని, ఆ పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. చాలా మంది అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. నేత మధ్య విభేదాల కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని వైకాపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారికి అడ్డంగా ఉండటంతో వాహనాలు, ఎడ్ల బండ్లు కనిపించవు.. అందుకే పగులగొట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని