పాద బాట.. పన్ను మోత
దట్టమైన అడవి.. ఏటా మహా శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు పాదబాటలో వెళ్తుంటారు.
శ్రీశైలానికి నడిచి వెళ్లే భక్తులపై భారం
నిబంధనల పేరిట అటవీ సిబ్బంది బాదుడు
దట్టమైన అడవి.. ఏటా మహా శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు పాదబాటలో వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి లక్షలాది భక్తులు నడిచి వెళ్లి భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్లను దర్శనం చేసుకుంటారు. ఈ ఏడాది ఐదు లక్షల మంది భక్తులు నడిచి వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.
న్యూస్టుడే, ఆత్మకూరు
రశీదులు చూపుతున్న కన్నడిగులు
ఆత్మకూరు పట్టణ సమీపంలో మొదలైన నడక వెంకటాపురం, నాగలూటి, దామెరకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా ఇలకైలాసం(శ్రీశైలం) వరకు కొనసాగుతుంది. మొత్తం 40 కి.మీ నల్లమల అడవిలో వెళ్లాల్సి ఉంటుంది. పల్లెకట్ట వద్ద అటవీ సిబ్బంది బేస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. పాదచారుల వద్ద రూ. 10 తీసుకొని రశీదు ఇస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే వెనక్కి పంపిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసమట
డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కన్నడిగులు ఆందోళన చేపట్టారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.పదేసి వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే అటవీ శాఖ సిబ్బంది నీళ్లు నములుతున్నారు. ‘‘ ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి జీవో కాపీ లేదు.. అధికారుల ముద్రతో ఉన్న రశీదు మాత్రమే ఇస్తున్నాం.. అటవీ మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ప్లాస్టిక్ తదితర చెత్త వేస్తున్నారు.. వాటిని తొలగించేందుకు, సిబ్బంది వేతనాలు.. పర్యావరణ నిర్వహణ ఛార్జీలు వసూలు చేయమని అధికారులు చెప్పారంటూ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు.
వాహనదారులకు
శ్రీశైలానికి వెళ్లే వాహనదారుల నుంచి పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ ఖర్చుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో టోల్ గేట్ ఏర్పాటు చేశారు.. పెద్ద వాహనాలైతే రూ.100, చిన్నవైతే రూ.50 చెల్లించాలి. సాధారణ రోజుల్లో రూ.40 వేలు, శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు రోజుకు వసూలవుతోంది. నల్లకాల్వ సమీపంలోని రుద్రకోటేశ్వర క్షేత్రానికి వెళ్లాలన్నా అటవీ సిబ్బంది ఆంక్షలు విధించారు. భక్తులు తాము వచ్చిన వాహనంలోనే అడవిలోకి వెళ్లాలంటే రూ.300 చెల్లించాలి.
15 రోజులు.. రూ.50 లక్షలు
మహాశివరాత్రికి పదిహేను రోజుల ముందు నుంచే నడక మార్గంలో భక్తులు వెళ్తుంటారు. ఈసారి ఐదారు లక్షల మంది వస్తారని అంచనా. దాదాపు రూ.50 లక్షలు పోగయ్యే అవకాశం ఉంది. ఉగాదికి ఇంత కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం రెండు నెలల్లో రూ. కోటికి పైగా సొమ్ము వసూలయ్యే అవకాశం ఉంది.
సౌకర్యాలు కల్పించాలి
గురురాజ్, కర్ణాటక
వేల కి.మీ. నుంచి కన్నడిగులం ఏటా స్వామి దర్శనానికి కాలిబాటన వస్తుంటాం. ప్రభుత్వం, దేవస్థానం అధికారులు అటవీ మార్గంలో కనీస సౌకర్యాలు కల్పించకపోగా..ఛార్జీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అడవి మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. దేవుడి దర్శనానికి నడిచి వెళ్తూ డబ్బులు ఎలా చెల్లించాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి చొరవ చూపి ఛార్జీల వసూలు జరగకుండా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే