ఆరోగ్యశ్రీకి పక్షవాతం
కొనగంటి అంజలికి పదేళ్లు. కాలు, చేయీ పడిపోయిందంటూ 2022 మే 2న ఆరోగ్యశ్రీ కింద ఓ నెట్వర్క్ ఆసుపత్రిలో వైద్యం చేశారు.
- కొనగంటి అంజలికి పదేళ్లు. కాలు, చేయీ పడిపోయిందంటూ 2022 మే 2న ఆరోగ్యశ్రీ కింద ఓ నెట్వర్క్ ఆసుపత్రిలో వైద్యం చేశారు. ఇందుకు ఆ పాపకు ఆసరా సొమ్ము రూ.30 వేలు, ఆసుపత్రి వైద్యసేవల కింద రూ.20 వేలు జమయ్యాయి.
- చిన్నారి ఎ.సాక్షికి కాలు, చేయీ పడిపోయిందంటూ 2022 సెప్టెంబరు 17న అదే నెట్వర్క్ ఆసుపత్రిలో చేరారు. ఆ కుటుంబానికి ఆసరా సొమ్ము రూ.30 వేలు, ఆసుపత్రికి రూ.20 వేలు నిధులొచ్చాయి.
- సురేఖకు కాలు, చేయీ పనిచేయడం లేదని 2022 సెప్టెంబరు 17న అదే నెట్వర్క్ ఆసుపత్రిలో చేరారు. ఈమెకూ ఆసరా సొమ్ము, ఆసుపత్రికి నిధులు సమకూరాయి.
... ఈ ముగ్గురే కాదూ.. 2022 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు 2,500 మంది కాలు, చేయీ పడిపోయినట్లు కర్నూలు నగరంలో ఓ నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు పక్క జిల్లాల వారికీ ఇక్కడ వైద్య సేవలు అందించినట్లు లెక్కలు రాసుకొని సొమ్ము బొక్కేశారు. డయోగ్నోస్టిక్ ల్యాబ్తో కుమ్మక్కై కాలు, చేయీ పడిపోయినట్లు నకిలీ నివేదికలు సృష్టించి ఆరోగ్యశ్రీ కింద రూ.కోట్లలో కాజేశారు.
న్యూస్టుడే, కర్నూలు వైద్యాలయం
పదేళ్ల పిల్లల పేరిట కాజేత
సదరు నెట్వర్క్ ఆసుపత్రి నుంచి 2,500 కేసుల వివరాలు పంపిస్తే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఒక్క కేసు కూడా తిరస్కరించకపోవడం గమనార్హం. ట్రస్టు సభ్యుల సహకారంతోనే ఆసుపత్రి యాజమాన్యం రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలున్నాయి. కర్నూలు సర్వజన వైద్యశాలలో ఎక్స్రే, ఎమ్మారై, చిన్నచిన్న వాటికి లేవని నెలకు సుమారు వందల సంఖ్యలో కేసులు తిరస్కరిస్తున్నారు. అలాంటిది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పక్షవాతం కేసులు సదరు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేర్చి నిధులు కాజేయడం గమనార్హం. ఆలస్యంగా గుర్తించిన ట్రస్టు సభ్యులు నాలుగు రోజుల కిందట ప్రత్యేక వైద్యులతో విచారణ చేపట్టారు. ఈ సమయంలో కేవలం ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, మధ్యాహ్న సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో పని చేసే ఓ వైద్యుడు ఉండటం గమనార్హం.
నగరంలో ఓ ఆసుపత్రితో దోపిడీ పర్వం
కర్నూలు సర్వజన వైద్యశాలకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర నుంచి రోగులు వస్తుంటారు. ఇక్కడ న్యూరోకు సంబంధించి మూడు నెలల్లో 400 నుంచి 500 కేసులు ఆరోగ్యశ్రీ కింద నమోదు కాలేదు. ఏడాది లెక్కలు తీసుకుంటే 1,600 నుంచి 2 వేలలోపే ఉంటాయి. నగరంలోని కొత్త బస్టాండు సమీపంలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన వారి లెక్కలు తీసుకుంటే అన్నీ అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. సదరు నెట్వర్క్ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్, న్యూరో ఫిజిషియన్ లేరు, ప్రభుత్వ వైద్యుడు ఒకరు మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటారు. అలాంటి చోట 2,500 మందికి వైద్యం అందించడం ఏవిధంగా సాధ్యమైందన్నది అనుమానం.
డోన్లో రూ.1.80 కోట్లు నొక్కేశారు
ఆరోగ్యశ్రీలో టైఫాయిడ్, డెంగీతోపాటు యాంజియోగ్రామ్ పరీక్షలకు బిల్లులు పొందే అవకాశం ప్రైవేట్ ఆసుపత్రులకు ఉంది. డోన్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు నకిలీ రోగులతో మోసానికి పాల్పడ్డారు. ఈ ఆసుపత్రిలో నెలకు రూ.1.80 కోట్ల వరకు మోసం జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని నడిపించడానికి డోన్ ఆసుపత్రి నిర్వాహకులు గుత్తి, పామిడిలో ఏజెంట్లను నియమించుకున్నారు. నకిలీ రోగిని ఆసుపత్రికి తీసుకొస్తే రూ.5 వేలు, రోగికి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట