గొంతు దిగని గోరుముద్ద
జగనన్న గోరుముద్ద గొంతుదిగడం లేదు.. నాణ్యతకు తిలోదకాలిచ్చారు.
23,808 మంది తినలేదు
కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలు
కర్నూలు విద్య, న్యూస్టుడే: జగనన్న గోరుముద్ద గొంతుదిగడం లేదు.. నాణ్యతకు తిలోదకాలిచ్చారు. పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణ అధ్వానంగా ఉంటోంది. కొన్ని పాఠశాలల్లో శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించగా.. ముద్దలుగా ఉన్న అన్నాన్ని వడ్డించడంతో విద్యార్థులు సరిగా తినలేకపోయారు. జిల్లాలో 1,459 ప్రభుత్వ యాజమాన్య బడుల్లో 2,71,215 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం 2,15,235 మంది హాజరయ్యారు. ఇందులో 53,808 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినలేదని అధికారులు లెక్కించారు. అలాగే ఎయిడెడ్ బడుల్లో 4,191 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఐజీఎంఎం పాఠశాలలో ముద్దలుగా ఉన్న అన్నం
విద్యార్థుల ఫిర్యాదు
కలెక్టర్ బంగ్లాకు కూత వేటు దూరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలలో కుళ్లిన గుడ్లు, పురుగులు పట్టిన చిక్కీలు, నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారంటూ కొందరు విద్యార్థినులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు తాఖీదులిచ్చి చేతులు దులుపుకొన్నారు. పూర్తి స్థాయిలో విచారించాలని కలెక్టర్ ఆదేశించినా.. ఆర్జేడీ రాఘవరెడ్డి కర్నూలుకు వచ్చారంటూ విచారణను అటకెక్కించారు. డిప్యూటీ ఈవో స్థాయిలో విచారణకు వెళ్లిన తనిఖీ అధికారులు ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందని కితాబు ఇవ్వడం ఏమటిన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పర్యవేక్షణ కుర్చీకే పరిమితం
మధ్యాహ్న భోజన పథకానికి చెందిన అధికారి కుర్చీకే పరిమితమవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈయనకు అదనంగా రెండు బాధ్యతలు ఉన్నాయనే సాకుతో కార్యాలయం వదిలి వెళ్లే పరిస్థితి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకంగా ఏడీ స్థాయిలో ఒక అధికారి ఉండేవారు. ఆయన పదోన్నతిపై ఇతర జిల్లాకు వెళ్లినప్పటి నుంచి ఆ పోస్టు అలాగే ఖాళీగా ఉండిపోయింది. ఈ విషయంపై డీఈవో శామ్యూల్ మాట్లాడుతూ... భోజనం నాణ్యతగా లేకుంటే ఆయా ఏజెన్సీలను రద్దు చేయడంతోపాటు ప్రధానోపాధ్యాయులకు నోటీసులు ఇస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహానందిలో చిరుతపులి సంచారం
[ 27-07-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత పులి సంచరించింది. -
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి
[ 27-07-2024]
ఎస్పీ జి.బిందు మాధవ్ ఆర్టీసి, ట్రాన్స్కో, నేషనల్ హైవే అథారిటీ, మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్