వాము రైతుకు వాత
వాము రైతులను కమీషన్ ఏజెంట్లు దగా చేస్తున్నారు... దాన్ని మార్కెట్ కమిటీ సమర్థిస్తోంది.
కర్నూలు మార్కెట్లో కమీషన్ల పర్వం
ఏజెంట్ల జేబుల్లోకి రూ.28.50 లక్షలు
బండిలో వెళ్తోంది 41 సంచులు
వాము రైతులను కమీషన్ ఏజెంట్లు దగా చేస్తున్నారు... దాన్ని మార్కెట్ కమిటీ సమర్థిస్తోంది. ఒక్కో లాట్ నుంచి రెండు కిలోల మేర కోత పెడుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్కు వాము క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. ఉమ్మడి కర్నూలు, తెలంగాణ, కర్ణాటక నుంచి రైతులు పెద్ద ఎత్తున సరకు తీసుకొస్తుంటారు. గత నెల 23 నుంచి క్రయవిక్రయాలు ప్రారంభయ్యాయి. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 9,500 లాట్లకు 2 కిలోల చొప్పున ఇప్పటి వరకు 190 క్వింటాళ్లు స్వాహా చేశారు. సరాసరి ఒక క్వింటాలు వాము ధర రూ.15,000 లెక్కన 190 క్వింటాళ్లకు రూ.28.50 లక్షల విలువ చేసే వాము పైకం కమీషన్ ఏజెంట్ల జేబుళ్లోకి వెళ్లింది.
న్యూస్టుడే, కర్నూలు మార్కెట్
మైకులో మాట.. అమల్లో దాటవేత
గేట్ పాస్ రసీదులో 38.33 సంచులు
వాము రైతుల నుంచి 2 కిలోలు కమీషన్ ఏజెంట్లు తీసుకోరాదని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉన్నా... అదే మార్కెట్ కమిటీవారు 2 కిలోలు తగ్గించి ఈ.నామ్ బిల్లులు ఇస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు రెండు కిలోలు స్వాహా చేయడాన్ని మార్కెట్ కమిటీ సమర్థిస్తోందన్నమాట. మార్కెట్కు ఓ రైతు వామును తీసుకురాగా.. తూకం వేసి 2.77 క్వింటాళ్లు ఉన్నట్లు పచ్చ రశీదులో రాసి ఇచ్చారు. దానికి సంబంధించి మార్కెట్ యార్డులో ఈ.నామ్ బిల్లు తెచ్చుకోగా 2.75 క్వింటాళ్లు చూపారు. ఇలా ప్రతి ఒక్క రైతుకు కోత పెడుతున్నారు.
సెస్సుకు ఎగనామం
ఓ వ్యాపారి శకుంతల ట్రేడర్స్ ద్వారా కొనుగోలు చేసిన వామును బయటకు తీసుకెళ్లారు. మొత్తం 38.33 సంచులున్నట్లు గేట్ పాస్ రశీదులో నమోదై ఉంది. వాస్తవంగా తీసుకెళ్లింది 41 సంచులు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెట్కు సెస్ కట్టాల్సి వస్తుందని ఇలా తప్పుడు రశీదు పత్రాలతో సరకును బయటకు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. నిత్యం వందల సంచులు ఇలా బయటకు తరలిస్తున్నా సిబ్బంది పట్టుకోవడం లేదు.
రెండు కిలోల కోత
‘‘ కర్నూలు పెద్ద మార్కెట్లో కమీషన్ ఏజెంట్ (లైసెన్సు నంబరు 407) దుకాణంలో వాము విక్రయానికి ఉంచా.. క్వింటా రూ.15,369 పలికింది.. మూడు సంచులు విక్రయానికి తీసుకురాగా 98 కిలోల తూకమైంది.. ఈ-నామ్లో 96 కిలోలే నమోదు చేసి బిల్లు ఇచ్చారు. కమీషన్ ఏజెంట్ దుకాణం వారికి 2 కిలోలుపోనూ 96 కిలోలకే నగదు చెల్లించారు. 2 కిలోల వామును కమీషన్ ఏజెంట్ కొట్టేశారు. సాధారణంగా 2 శాతం కమీషన్తోపాటు రెండు కిలోల వాము ధర కలిపి రూ.602.40 కమీషన్ ఏజెంట్ పట్టుకొని మిగిలిన పైకం ఇచ్చారని ’’ అవుకు మండలం కొండమనాయనిపల్లెకు చెందిన గంగాధర్ వాపోయారు.
కమీషన్ భారం
‘‘ ఆరు సంచుల వాము విక్రయానికి తెచ్చా. క్వింటా రూ.17,444 పలికింది. 2.77 క్వింటాళ్లు విక్రయించగా ఈ.నామ్ బిల్లు 2.75 క్వింటాళ్లకే ఇచ్చారు. కమీషన్ ఏజెంట్ 2 శాతం కమీషన్ రూ.959.42 పట్టుకొని మిగిలిన పైకం చెల్లిస్తున్నారు.. మళ్లీ 2 కిలోలు తీసేసి 2.75 క్వింటాళ్లకే బిల్లు ఇస్తున్నారు.. రెండు శాతం కమీషన్తోపాటు 2 కిలోల వాముకు రూ.348.88 కలిపి మొత్తం రూ.1,308.3 కమీషన్ తీసుకున్నారని’’ కొండమనాయనిపల్లెకు చెందిన వెంకటకృష్ణ వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు