logo

‘ఇంటికి వెళ్లేందుకు జగన్‌ సిద్ధం’

ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. రానున్న ఎన్నికల్లో ఓటమి చెంది ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శనివారం కర్నూలులో మాట్లాడారు.

Published : 25 Feb 2024 02:49 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. రానున్న ఎన్నికల్లో ఓటమి చెంది ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శనివారం కర్నూలులో మాట్లాడారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు తాను సైతం సంసిద్ధంగా ఉన్నానని.. చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాలు విసరగా జగన్‌ తోక ముడిచారని ఆరోపించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబునాయుడి సవాలును స్వీకరించి చర్చకు సిద్ధం కావాలన్నారు. అనునిత్యం అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబును గెలిపించుకుని జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని