logo

నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తా

లోకాయుక్తకు వచ్చే కేసుల విషయంలో నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని ఉప లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన పగిడి రజని అన్నారు. కర్నూలు సంతోష్‌ నగర్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయంలో ఉప లోకాయుక్త సేవలను శనివారం ప్రారంభించారు.

Published : 25 Feb 2024 03:17 IST

బాధ్యతలు స్వీకరిస్తున్న పగిడి రజని

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : లోకాయుక్తకు వచ్చే కేసుల విషయంలో నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని ఉప లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన పగిడి రజని అన్నారు. కర్నూలు సంతోష్‌ నగర్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయంలో ఉప లోకాయుక్త సేవలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి.. పగిడి రజనితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాసరావు, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోలయ్య, ఏఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని