ప్రమాదంలో యువకుడి మృతి
సోదరుడి వివాహం.. ఆ ఇల్లంతా సందడిగా ఉంది.. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.. అంతలోనే అందిన సమాచారం ఆ ఇంట విషాదాన్ని నింపింది.
పెళ్లింట విషాదం
నవీన్ (పాతచిత్రం)
పెరవలి(మద్దికెర), న్యూస్టుడే: సోదరుడి వివాహం.. ఆ ఇల్లంతా సందడిగా ఉంది.. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.. అంతలోనే అందిన సమాచారం ఆ ఇంట విషాదాన్ని నింపింది. మద్దికెర మండలం పెరవలికి చెందిన సుధారాణి, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు కెమార్తెలు, కుమారుడు నవీన్(25) ఉన్నారు. నవీన్ ఇంటి నిర్మాణ పనులకు వెళ్తూ జీనవం సాగించేవాడు. ఈ యువకుడు బుధవారం వేకువ జామున మరో ఇద్దరితో కలిసి పెళ్లి పనుల్లో భాగంగా కారులో గుంతకల్లు వెళ్లారు. అయితే మద్దికెర- కసాపురం గ్రామాల మధ్య టైరు పేలిపోయి అదుపుతప్పింది. వాహనం బోల్తా పడిన సమయంలో తీవ్రంగా గాయపడిన నవీన్ను అనంతపురం, తర్వాత కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందటంతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. అండగా ఉండాల్సిన సమయంలో అందని లోకాలకు వెళ్లాడని వారు రోదిస్తున్న తీరు బంధుమిత్రులను కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుడి మృతితో పెళ్లి ఆగిపోయింది.
దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడి దుర్మరణం
ఎ.వీరప్రకాశ్
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: పత్తికొండ పట్టణ సమీపంలోని పుచ్చకాయలమడ గ్రామానికి వెళ్లే దారిలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఎ.వీరప్రకాశ్(50) మృతిచెందారు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పత్తికొండ నుంచి గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణమూర్తి, ఆనంద్ తీవ్రంగా గాయపడగా.. సురేశ్, సువర్ణకు స్వల్పగాయాలయ్యాయి. వీరిలో కృష్ణమూర్తిని కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆదర్శ దివ్యాంగుల కమిటీ, మహాత్మ దివ్యాంగుల ప్రాంతీయ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎ.వీరప్రకాశ్ గురువారం కర్నూలులో జరగనున్న దివ్యాంగుల సింహగర్జన ఏర్పాట్లపై తోటి వారితో చర్చించారు. సాయంత్రం గ్రామానికి ఆటోలో బయల్దేరారు. పుచ్చకాయలమడ గ్రామ సమీపంలో ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.
ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్న కేఈ శ్యాంబాబు
పత్తికొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. వీరప్రకాశ్ మృతిచెందారు. సమాచారం అందుకున్న భార్య ఉరుకుందమ్మ, కుమారుడు హర్ష ఆసుపత్రి వద్దకు చేరుకొని రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కేఈ శ్యాంబాబు, సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి, శ్రీధర్రెడ్డి, వెంకటపతి తదితరులు ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని కేఈ శ్యాంబాబు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పత్తికొండ పోలీసులు తెలిపారు.
కుళాయి ఘర్షణలో మరొకరు..
ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్టుడే : మండల పరిధిలోని కందనాతిలో ఇటీవల ఇంటి కుళాయి విషయంలో జరిగిన ఘర్షణలో నరసింహులు(50) అనే మరొక వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ నెల 21న జరిగిన ఘర్షణలో రవి, నరసింహులుపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రవి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందగా... నరసింహులు బుధవారం మృతి చెందారు. నరసింహులుకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో ఇద్దరు హత్యకు గురికావడంతో గ్రామీణ సీఐ మోహన్రెడ్డి అధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హత్య కేసులో నిందితుల అరెస్టు...
ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్టుడే : కందనాతిలో కుళాయి విషయంలో జరిగిన హత్య కేసులో 12 మంది నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు గ్రామీణ సీఐ మోహన్రెడ్డి, ఎస్సై శరత్కుమార్రెడ్డి పేర్కొన్నారు. నిందితులు బోయ గోవిందు, బోయ లోకేశ్ అలియాస్ గోనెగండ్ల లోకేశ్, బోయ వెంకటేశ్ అలియాస్ గోనెగండ్ల వెంకటేశ్, బోయ శ్రీను, బోయ నరసయ్య, బోయ పరమేశ్, బోయ మారెన్న అలియాస్ ఉడతల మారెన్న, బోయ ఈరన్న, బోయ కేశన్న అలియాస్ గొర్రెల కేశన్న, బోయ మహేశ్, బోయ కేశన్న అలియాస్ గువ్వోడు, బోయ మారెన్న అలియాస్ చిన్నమారెన్నను కందనాతి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ, ఎస్సై వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు