శ్రీగిరికి బ్రహ్మోత్సవ శోభ
జ్యోతిర్లింగ శ్రీశైల క్షేత్రం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.
ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది
నేడు కలెక్టర్ సమీక్షా సమావేశం
ఆంధ్ర బస్సుల పార్కింగ్ ప్రదేశం
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : జ్యోతిర్లింగ శ్రీశైల క్షేత్రం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించనున్నారు.
వెంకయ్యసత్రం వద్ద షామియానా
- కలెక్టర్ ఆదేశాలతో దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతం చేశారు. గత ఏడాది కన్నా 20 శాతం అధిక వసతులు కల్పించడానికి సిద్ధం చేస్తున్నారు.
- పార్కింగ్ ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, హైమాస్ట్ విద్యుత్ దీపాలు వంటి సదుపాయాలు కల్పించారు.
- ఆలయ పరిసరాలు, ఉద్యానవనాల్లో షామియానాలు, పెండాల్స్, చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు.
- ఉచిత దర్శనం కోసం క్యూలైన్లను పెంచారు. ఆలయ వీధుల్లో తాత్కాలిక క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు.
నడిచి వస్తున్న శివస్వాములు
- బ్రహ్మోత్సవాల్లో 35 లక్షల లడ్డూలు తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయి.
- పీహెచ్సీ వద్ద 30 పడకల తాత్కాలిక వైద్యశాల సిద్ధం చేస్తున్నారు. కాలినడక భక్తుల కోసం మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంకటాపురం నుంచి నాగులూటి, పెచ్చెరువు, కైలాస ద్వారం, శ్రీశైలం పరిసరాల్లో మెడికల్ క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి. దేవస్థానం వైద్యశాల, పీహెచ్సీ, సున్నిపెంట ప్రాజెక్ట్ వైద్యశాలలో కూడా వైద్యులకు అదనపు డ్యూటీల ప్రణాళిక సిద్ధం చేశారు.
- పాదయాత్ర భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు. కైలాస ద్వారం వద్ద నుంచి భీముని కొలను వరకు తాగునీటి పైపులైన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు.
- దాతలు చేపట్టే అన్నదాన కేంద్రాలకు దేవస్థానం తరఫున వసతులు కల్పిస్తారు. ప్రత్యేక విధులకు వచ్చే ఉద్యోగులకు అన్నపూర్ణ భవన్లో అల్పాహారం, భోజన సదుపాయాలు ఉంటాయి.
- శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, వసతి కల్పిస్తున్నారు.
- పాతాళగంగ స్నానఘాట్ల వద్ద బారికేడ్లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజుల సత్రం, ఆర్టీసీ బస్టాండు వెనుక జల్లు స్నానం ఏర్పాట్లు చేస్తున్నారు.
- భక్తుల కోసం రూట్ మ్యాప్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భక్తులు తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకుంటారు.
భక్తులు స్నానాలు చేసుకోవడానికి రాజుల సత్రం వద్ద ఏర్పాటు చేసిన షవర్లు
ఉచిత బస్సులు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎప్పుడూ లేని విధంగా 10 ఉచిత బస్సులు నడపాలని దేవస్థాన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆలయ ప్రధాన వీధుల వరకు భక్తులను ఉచితంగా బస్సుల్లో తీసుకెళ్లనున్నారు. టెండర్ పద్ధతిలో హైర్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్