నిమిషం ఆలస్యమైనా నిరాకరణ
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరగనున్న పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,814 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
పునశ్చరణలో ఇంటర్ విద్యార్థులు
కర్నూలు విద్య, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరగనున్న పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,814 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 121 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించకూడదని ఇంటర్ బోర్డు నుంచి ఇప్పటికే ఆదేశాలందాయి. హాల్టిక్కెట్లను ఇప్పటికే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో ఉంచారు. కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మంచినీరు, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అవకతవకలు, మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు, కర్నూలు నగరంలోని ఇంటర్ ప్రాంతీయ కార్యాలయానికి అనుసంధానం చేశారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని కర్నూలు ఆర్ఐవో గురువయ్య శెట్టి బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు.
75,814 మంది విద్యార్థులు
కర్నూలు జిల్లాలో మొత్తం 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు మొత్తం 47,412 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలు నిల్వ చేసేందుకు 23 కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిపార్టుమెంట్ ఆఫీసర్లు 69 మంది, చీఫ్ సూపరింటెండెంట్లు 69 మంది, కస్టోడియన్లు ఐదుగురు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ముగ్గురు, సిట్టింగ్ స్క్వాడ్ ఆరుగురు, ఒక హైపవర్ కమిటీ, డీఈసీ కమిటీలు 4, డీవీఈవోలు 2 ఇద్దరు, ఇన్విజిలేటర్లను సుమారు 1,000 మందిని నియమించారు. నంద్యాల జిల్లాలో 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 28,402మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
కర్నూలు జిల్లాలో 5, నంద్యాలలో 4 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించారు. ఆలూరు, పత్తికొండ, దేవనకొండ, కోసిగి, చిప్పగిరి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ‘‘ సమస్యాత్మక కేంద్రాల్లో రెండింతల పకడ్బందీ చర్యలు చేపట్టాం. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు చరవాణులు తీసుకెళ్లకూడదు. సమాచార సేకరణకు ఇంటర్ బోర్డు అందజేసిన కీప్యాడ్ ఫోన్లు అందజేశాం. వీటిని మాత్రమే వాడాలి. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూం నంబరు 08518 222047కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని’’ జిల్లా పరీక్షల కన్వీనర్ గురువయ్యశెట్టి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి