గ్రూప్-2 నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పరీక్ష కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఈనాడు, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ పరీక్ష కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదోనిలోని భాష్యం విద్యాసంస్థలో గది నంబరు 6కు ఇన్విజిలేటర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ప్రశ్నపత్రాలను నేరుగా గదిలోకి తీసుకురావడంతో పరీక్ష రాసేందుకు వచ్చినవారు నివ్వెరపోయారు. పరీక్ష హాలులో ప్రశ్నపత్రాల కవర్ సీల్ తెరవాల్సి ఉండగా.. ఎలాంటి కవర్ లేకుండా నేరుగా పత్రాలు తేవడంపై కొందరు అభ్యంతరాలు తెలిపారు. ఆయా ప్రశ్నపత్రాల కవర్లను ఇన్విజిలేటర్లకు ఇచ్చిన గదిలోనే దానిని తెరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు ఓ ప్రశ్నపత్రానికి ఉండాల్సిన స్టిక్కర్ సీల్ కూడా లేదని అభ్యర్థులు గుర్తించారు. ఆ విషయాన్ని ఇన్విజిలేటర్ దగ్గర కొందరు ప్రస్తావించగా సీల్ అలాగే ఊడిపోయి ఉందని ఇన్విజిలేటర్ చెప్పినట్లు సమాచారం. పరీక్ష ముగిసిన తర్వాత ఆ గదిలో పరీక్ష రాసిన విద్యార్థులు విషయాన్ని అదే రోజు పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పత్రంపై సుమారు 40 మంది సంతకాలు చేసినట్లు తెలిసింది. దీనిని ఉన్నతాధికారులకు పంపి విచారణ చేయిస్తామని ఆ రోజు విధుల్లో ఉన్నవారు హామీ ఇవ్వడంతో అభ్యర్థులందరూ పరీక్ష కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఫిర్యాదును ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణశర్మకు పంపి విచారణ చేయిస్తామని, పోలీసులకు కూడా ఫిర్యాదు ఇస్తామని నాడు పరీక్ష కేంద్రంలోని అధికారులు అభ్యర్థులకు చెప్పారు. ఫిర్యాదుదారుల సెల్ నంబర్లను సైతం పరీక్ష కేంద్రం అధికారులు తీసుకున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో కొందరు నాడు జరిగిన సంఘటన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తమ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియడంతో విస్మయానికి గురయ్యారు. ఆ ఘటన వివరాలను మీడియాకు తెలపడంతో నిబంధనల ఉల్లంఘనల గుట్టు రట్టైంది.
ఎన్నో అనుమానాలు..
పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన మార్గదర్శకాలుంటాయి. ఆయా నిబంధనలను ఉల్లంఘించడం వెనక ఎవరి హస్తం ఉందోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పట్టించుకోలేదన్న విషయం వెలుగులోకి రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిన పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన అధికారులు ఎవరికి ఫిర్యాదు చేశారన్న విషయం మిస్టరీగా మారింది. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఆదోని సీఐ శివనారాయణస్వామి ‘ఈనాడు’కు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్