శ్రీగిరి బ్రహ్మోత్సవాలు చూతము రారండీ
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం ఉదయం వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 11 వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
భక్తులకు అలంకార దర్శనం
ఇరుముడి శివదీక్ష భక్తులకు స్పర్శ దర్శనం
మల్లన్న ఆలయానికి విద్యుద్దీప కాంతుల శోభ
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం ఉదయం వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 11 వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈసందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. భక్తులకు తాత్కాలిక వసతి, దర్శనం క్యూలైన్లు, మంచినీరు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు.
వాహన సేవలు
- 2న భృంగి వాహన సేవ
- 3న హంస వాహన సేవ
- 4న మయూర వాహన సేవ
- 6న రావణ వాహన వాహనం, పుష్పపల్లకి సేవ
- 7న గజ వాహన సేవ
- 8న నందివాహన సేవ
- 9న రథోత్సవం, తెప్పోత్సవం
విశేష కార్యక్రమాలు
2న ద్వారకా తిరుమల దేవస్థానం, 3న విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం, 4న తితిదే తరఫున, 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
30 లక్షల లడ్డూలు సిద్ధం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 లక్షల లడ్డూలను విక్రయించడానికి దేవస్థానం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గణేశ్ సదన్ ఎదురుగా రెండు తాత్కాలిక కౌంటర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద నాలుగు కేంద్రాలు అందనంగా ఏర్పాటు చేస్తున్నారు.
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జేసీ
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలంలోని దేవస్థానం సీసీ కంట్రోల్ సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వశాఖ అధికారులు, దేవస్థానం అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ...అన్ని శాఖల అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రత్యేక విధుల నిమిత్తం వచ్చిన సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్యులతో మెరుగైన సేవలు అందించాలన్నారు. భక్తుల కోసం హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అటవీశాఖ అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో జేసీ మండిపడ్డారు. అటవీశాఖ చెక్పోస్టుల వద్ద భక్తుల వాహనాల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం జేసీ రాహుల్మీనా, అదనపు ఎస్పీ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, ఛైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవోపెద్దిరాజు, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ఆజాద్ పాల్గొన్నారు.
దర్శనం.. సేవల వివరాలు
- ఉచిత దర్శనం భక్తులకు రథశాల వద్ద నుంచి క్యూలైన్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తారు.
- రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు క్యాంప్కోర్టు వద్ద ఉన్న క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు.
- చంటిపిల్లల తల్లులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. విరాళ కేంద్రం వద్ద ఉన్న మైక్ అనౌన్స్ గది వద్ద నుంచి దివ్యాంగులను అనుమతిస్తారు.
- ఆలయ క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులకు నిరంతరం మంచినీటితో పాటు అల్పాహార ప్రసాదాలు అందజేస్తారు.
- శివదీక్షా భక్తులను చంద్రావతి కల్యాణ మండపం వద్ద నుంచి క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
భ్రమరాంబాదేవికి కానుకగా బంగారు ఆభరణాలు
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబాదేవికి చిలకలూరిపేటకు చెందిన ఎన్.రమేశ్బాబు దంపతులు బంగారు హారం, కమ్మలను కానుకగా సమర్పించారు. 79 గ్రాముల బంగారు హారం, 8 గ్రాముల కమ్మలను ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి, ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జునకు గురువారం అందజేశారు. దాతలను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం