ఉపాధిలో అవినీతి ఘనులు
వలసలు నివారించి గ్రామాల్లో అర్హులైన వారికి పనులు చూపే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం పక్కదారి పడుతోంది. పథకంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని కొందరు నిధులు స్వాహా చేస్తున్నారు.
ఆదోని మండలంలో ఉపాధి పనులు
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: వలసలు నివారించి గ్రామాల్లో అర్హులైన వారికి పనులు చూపే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం పక్కదారి పడుతోంది. పథకంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని కొందరు నిధులు స్వాహా చేస్తున్నారు. పేదలకు పని చేపే మాటేమిటోగానీ.. పెద్దలకు ఉపాధిగా మారింది. పనులకు రాకపోయినా.. వచ్చినట్లు హాజరు వేయడం.. వచ్చిన సొమ్మును స్వాహా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికితోడు సామాజిక తనిఖీలు నామమాత్రంగా మారాయి. ఆదోని మండలం అరేకల్, చిన్నపెండేకల్, దొడ్డనగేరి, కపటి, నారాయణపురం, అలసందగుత్తి తదితర గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కొందరు పనులకు రాకున్నా ఖాతాల్లో వేతనాలు జమవుతున్నాయి. మరికొందరు వేరే ప్రాంతాల్లో ఉండి ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోతున్నా నగదు వేస్తున్నారు. కొందరు ఒప్పంద ఉద్యోగులు జాబ్ కార్డులు తీసుకున్నారు. వారు ఉపాధి పనులు ఎపుడు చేస్తారో? ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తారో తెలియాల్సి ఉంది. పర్యవేక్షణ చేయాల్సిన కొందరు మండల ఏపీవోలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు.
తనిఖీలు నామమాత్రం
ఉపాధి పనులకు సంబంధించి ఏడాదికోసారి జరిగే సామాజిక తనిఖీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని వెలికి తీయాల్సిన సామాజిక తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. అరేకల్ గ్రామంలో పరిశీలిస్తే 2019-20లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 64 పనులకు రూ.13,86,386 ఖర్చు చేశారు. సామాజిక బృందం సభ్యులు తనిఖీ చేసి రూ.3,500 దుర్వినియోగమైనట్లు తేల్చారు. 2020-21లో రూ.32,63,313తో 25 పనులు చేయగా రికవరీ రూ.1,000గా చూపడం గమనార్హం. 2021-22లో 41 పనులకు రూ.27,19,529 వెచ్చించారు. రికవరీ రూ.3,647 తేల్చారు. 2022-23లో 46 పనులకు రూ.66,94,674 ఖర్చు చేయగా సామాజిక తనిఖీ నిర్వహించి కేవలం రూ.1,557 రికవరీకి ఆదేశించడం గమనార్హం. దీనిని పరిశీలిస్తే సామాజిక తనఖీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
పర్యవేక్షణ కరవు
ఉపాధి పనుల్లో కొందరు ఇంజినీరింగ్ ప్రతినిధులు, సాంకేతిక, క్షేత్ర సహాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఉపాధి పనులపై దృష్టి సారించి విచారణ చేయాల్సిన సామాజిక తనిఖీ బృందాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా చూడాల్సి ఉండగా నిర్లక్ష్యం కనపడుతోంది.
ఆదోని మండల ఉపాధి కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లే అన్నీ తామై నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు క్షేత్ర సహాయకులు తెచ్చిన నివేదికలను పైఅధికారులకు పంపించాల్సింది ఆపరేటర్లే. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి తప్పుడు నివేదిక పంపేలా చేస్తున్నారు. ఇటీవల వారిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ