గడపలో మాట.. నీటి మూట
గడప.. గడపకొచ్చారు.. సమస్యలపై ప్రజలు నిలదీస్తే ‘హామీ’ ఇచ్చి వీధి దాటారు.. ఇదిగో అంటూ ప్రజాప్రతి‘నిధు’లు గొప్పలు చెప్పారు. ‘బిందెడు’ నీళ్లు ఇవ్వలేకపోయారు.. వీధిలో స్తంభం పెట్టలేకపోయారు..
ఆలూరు గ్రామీణ: మంచినీటి సమస్య పరిష్కరించాలని గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆస్పరి మండలం కైరుప్పలకు వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరామ్కు గ్రామస్థులు విన్నవించారు. 2022లో మాట ఇచ్చారు.. ఇప్పటికీ పరిష్కరించలేదు.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే : గడప.. గడపకొచ్చారు.. సమస్యలపై ప్రజలు నిలదీస్తే ‘హామీ’ ఇచ్చి వీధి దాటారు.. ఇదిగో అంటూ ప్రజాప్రతి‘నిధు’లు గొప్పలు చెప్పారు. ‘బిందెడు’ నీళ్లు ఇవ్వలేకపోయారు.. వీధిలో స్తంభం పెట్టలేకపోయారు.. కర్నూలు జిల్లా పరిధిలో 3,671 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపించగా 441, నంద్యాలలో 2,033 పనులు ప్రతిపాదిస్తే 717 పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో 720 పనులకు సంబంధించి రూ.34.69 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వంపై నమ్మకం లేక పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కొందరు ముందుకొచ్చినా బిల్లులు ఇవ్వలేదు. వారంతా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
5,087 పనులకు ఆమోదం
కర్నూలు జిల్లాలో 3,132 పనులకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. వీటికి రూ.163.06 కోట్లు ఖర్చవుతాయని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో రూ.87.73 కోట్ల విలువ చేసే 1,779 పనులే ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.24.06 కోట్ల విలువైన 441 పనులు పూర్తి చేశారు. 133 పనులకు సంబంధించి రూ.7.82 కోట్ల విలువ చేసే బిల్లులు అప్లోడ్ చేశారు. నంద్యాల జిల్లాలో రూ.97.25 కోట్లు విలువ చేసే 1,955 పనులు మంజూరయ్యాయి. వీటిల్లో రూ.68.23 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టగా 1,462 పనులే ప్రారంభించారు.
విద్యుత్తు వెలుగులు ఎప్పుడో
ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాల ఏర్పాటుకు సంబంధించి పనులను గుత్తేదారుల ద్వారా చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో రూ.లక్షల విలువ చేసే పనులు చేపట్టగా సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేశారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యుత్తు శాఖ పనులకు మాత్రం ఏపీఎస్పీడీసీఎల్ చెల్లించాలని చెప్పడం గమనార్హం. అప్లోడ్ చేసిన బిల్లులన్నీ మంజూరవుతున్నాయని ముఖ్య ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. జీజీఎంపీ పథకం కింద సకాలంలో బిల్లులు రావడం లేదనే కారణంతో పనులు చేసేందుకు గుత్తేదారులు సుముఖత చూపడం లేదన్న విమర్శలున్నాయి.
నత్తను తలపిస్తున్నాయ్
- చిప్పగిరి, దేవనకొండ, హొళగుంద, కోడుమూరు, నందవరం మండలాలతోపాటు ఎమ్మిగనూరు పట్టణంలో ఒక్క పనీ పూర్తి కాలేదు. సి.బెళగల్ మండలంలో 64 పనులు మంజూరు చేయగా 37 వరకు వివిధ దశల్లో ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క పని పూర్తైంది.
- దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేశారు. ప్రస్తుతం 91 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కటీ పూర్తి కాలేదు.
- తుగ్గలి మండలంలో రూ.6.63 కోట్లతో 175 పనులు మంజూరు చేశారు. 174 పనులు వివిధ దశలో ఉన్నాయి. కేవలం ఒక్కటి మాత్రమే పూర్తైంది.
- ఎమ్మిగనూరు పట్టణంలో రూ.2.59 కోట్లతో 27 పనులకు ఆమోదం తెలిపారు. 11 పనులు వివిధ దశలో నత్తనడకన సాగుతున్నాయి.. ఒక్కటీ పూర్తి కాలేదు.
జలం అందక.. జనం గొంతెండుతోంది
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు గ్రామాల్లో జనం గొంతెండుతోంది. రోడ్లెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కల్లుదేవకుంటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలడోన, మంత్రాలయానికి వెళ్లి నీటిని తెచ్చుకొనే పరిస్థితి నెలకొంది.
- నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 10 బొల్లవరంలో గత నెల రోజులుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. సమస్య తీర్చాలంటూ అధికారులు, పాలకులను జనం నిలదీస్తున్నారు. కర్నూలు-గుంటూరు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
- డోన్ మండలంలోని చనుగొండ్ల, ఎద్దుపెంట, కొత్త బురుజు, తిమ్మాపురం, మల్లంపల్లి తదితర గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని వామపక్ష పార్టీల నాయకులు అధికారులకు మొరపెట్టుకున్నారు.
- వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, ఎల్లార్తి, హెబ్బటం, పెద్ద గోనేహల్ తదితర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం