పశ్చిమాన నెత్తుటి తిలకం
ఆరుగాలం కష్టపడి.. అప్పులు చేసి.. పంటలు సాగు చేస్తారు. వచ్చిన దిగుబడి విక్రయించాలంటే స్థానికంగా సరైనా మార్కెట్ సౌకర్యం లేదు. ఉన్న మార్కెట్లో గిట్టుబాటు ధర రాదు.
మిరప దిగుబడి విక్రయాలకు వెళ్తూ మృత్యువాత
స్థానిక మార్కెట్లో ధర కరవు..
హాలహర్వి, ఆదోని మార్కెట్, న్యూస్టుడే: ఆరుగాలం కష్టపడి.. అప్పులు చేసి.. పంటలు సాగు చేస్తారు. వచ్చిన దిగుబడి విక్రయించాలంటే స్థానికంగా సరైనా మార్కెట్ సౌకర్యం లేదు. ఉన్న మార్కెట్లో గిట్టుబాటు ధర రాదు. కష్టానికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతో పశ్చిమ ప్రాంతం నుంచి సుమారు 450 కి.మీ. దూరంలోని గుంటూరు, కర్ణాటక రాష్ట్రంలోని బ్యాడిగ మార్కెట్లకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ప్రమాదాల బారిన పడి రైతులు మృత్యుఒడికి చేరుతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన రైతులు నలుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కుటుంబాలు వీధినపడ్డాయి.
విక్రయాలకు ప్రాణాలు పణం
కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైనా ఆదోని, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు, ఆలూరు, హాలహర్వి, హొళగుంద మండలాల్లో బ్యాడిగి రకం మిరపను, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో గుంటూరు, బ్యాడిగి రకానికి చెందిన మిరప సాగు చేస్తారు. పంట ఎదుగుదల, దిగుబడి కోసం రూ.లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తారు. వచ్చిన దిగుబడి విక్రయించేందుకు అన్నదాతలకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వారంలో మూడు రోజుల పాటు మిరప విక్రయాలు కొనుగోలు చేసినా.. కర్షకులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులు పడుతూనే గుంటూరు, కర్ణాటక రాష్ట్రం బ్యాడిగి వంటి ప్రాంతాలకు తరలించి విక్రయించుకొని వస్తున్నారు. దిగుబడి విక్రయించేందుకు వెళ్తున్న రైతులు ప్రమాదాల బారినా పడుతుండటంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
దృష్టిసారించని ప్రభుత్వం
స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యం లేక అన్నదాతలు మృత్యువాగ పడుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో బ్యాడిగి రకం మిరప సాగు చేస్తున్నారు. ఈ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి గ్రామాల్లోనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి. దీని ద్వారా రైతులకు మంచి జరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
పోటీ లేని వ్యాపారం
ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో మిర్చి విక్రయాలు గత ఏడాది డిసెంబరులో ప్రారంభించారు. కానీ వ్యాపారుల మధ్య పోటీ లేకపోవడంతో క్రయవిక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఆరంభంలో వారంలో రెండు రోజులు(బుధ, ఆదివారం) మార్కెట్ నిర్వహించే వారు. హామాలీల విన్నపం మేరకు వారంలో మూడు రోజులు(సోమ, బుధ, శుక్రవారం) మిర్చి వ్యాపారాలను సాగిస్తున్నారు. ఆరంభంలో దిగుబడులు ఫర్వాలేదనపించినా, అనంతరం పేలవంగా వస్తున్నాయి. సరాసరి 1400-4 వేల బస్తాల దాకా సరకు అమ్మకానికి వస్తోంది. స్థానిక టోకు వ్యాపారులే వస్తుండటం, ధర చూసి కొనుగోలు చేయడంతో ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. పెద్ద వ్యాపారులు, ప్రధానంగా ఎగుమతి చేసే వ్యాపారులు వస్తే ధరలు బాగా పలికే అవకాశముందంటున్నారు. ఇలాంటి వ్యాపారులు వస్తే, మిర్చి శీతల గోదాములు, కారం మిషన్లు మర యంత్రాలు, ప్యాకింగ్ వంటి పరిశ్రమలు ఏర్పడతాయంటున్నారు.
బతుకులు రోడ్డుపాలు
- ఫిబ్రవరి 26న పెద్దకడబూరు మండలం నాగలాపురం, మంత్రాలయం మండలం సింగరాజనహళ్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు తాము పండించిన మిరప కాయల దిగుబడులను కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్లో విక్రయించడానికి టెంపో (బోలెరో) వాహనంలో బయల్దేరారు. ఆదివారం అర్ధరాత్రి బ్యాడిగ సమీపంలోని దావణగేరి వద్దకు చేరుకోగానే టైరు పంచర్ కావడంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగలాపురానికి చెందిన పెద్ద ఎంకన్న(40), పింజరి మస్తాన్(45), సింగరాజనహళ్లికి చెందిన ఆటో ఈరన్న(35) అక్కడికక్కడే మృతిచెందారు. లింగన్న, చిన్నారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
- మార్చి 4వ తేదీన పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామానికి చెందిన కొందరు రైతులు మిరప పంటను విక్రయించేందుకు బొలేరో వాహనంలో కర్ణాటకలోని బ్యాడిగకు శనివారం సాయంత్రం బయల్దేరారు. బళ్లారి జిల్లా రాంపురం ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా టైరు పేలి వారి వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో బోయ నాగేంద్ర అలియాస్ రోగెన్న(38) వాహనం కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ప్రమాదంలో నలుగురు రైతులు గాయాలతో బయటపడ్డారు.
- గతేడాది మిరప పంటను విక్రయించేందుకు వెళ్లిన హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన రైతులు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే